ఇదేమి ఫిష్ మార్కెట్ కాదు.. ప్రజలు చూస్తున్నారు : తమ్మినేని సీతారాం

Webdunia
శుక్రవారం, 12 జులై 2019 (14:15 IST)
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల వేళ సభలో టీడీపీ సభ్యులు గీత దాటుతున్నారు. దీంతో సభాపతి తమ్మినేని సీతారాం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా, విపక్షనేతలు మాట్లాడే సమయంలో అధికారపక్ష సభ్యులు నోరు మెదపడం లేదనీ, కానీ, సభానేత ముఖ్యమంత్రి మాట్లాడే సమయంలో విపక్ష సభ్యులు ఇష్టానుసారంగా మాట్లాడటం భావ్యంకాదని సుతిమెత్తగా హెచ్చరించారు. 
 
పైగా, సభ ఆర్డర్ తప్పుతుంటే తాను చూస్తూ మిన్నకుండిపోవడానికి ఇదేమి ఫిష్ మార్కెట్ కాదంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. సభానేత, విపక్ష నేతలు మాట్లాడే సమయంలో ఏ ఒక్క సభ్యుడు అడ్డు తగలవద్దని కోరారు. సభను తాను హుందాగా నడిపించాలని కోరుకుంటున్నానని, అందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. 
 
అంతకుముందు ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ సభ్యులు సభా హక్కుల ఉల్లంఘన నోటీసును ఇచ్చారు. సున్నా వడ్డీపై నిన్న జరిగిన చర్చలో తమపై నిరాధార ఆరోపణలు చేశారని, అందుకే నోటీసు ఇస్తున్నామని టీడీపీ తెలిపింది. అసత్యాలు మాట్లాడి, సభను పక్కదోవ పట్టించిన ముఖ్యమంత్రిపై చర్యలు తీసుకోవాలని స్పీకర్‌కు ఇచ్చిన నోటీసులో పేర్కొంది. సున్నా వడ్డీపై గురువారం జరిగిన చర్చపై శుక్రవారం సమావేశాల్లో కూడా టీడీపీ చర్చను ప్రారంభించింది. మరోవైపు, సున్నా వడ్డీపై చర్చకు తాము కూడా సిద్ధంగా ఉన్నామని జగన్ తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మద్రాస్ నా జన్మభూమి, తెలంగాణ నా కర్మభూమి, ఆంద్ర నా ఆత్మభూమి: అఖండ 2 ప్రెస్ మీట్లో బాలయ్య

Aishwarya Rajesh: తిరువీర్, ఐశ్వర్య రాజేష్ టైటిల్ ఓ..! సుకుమారి

రామానాయుడు స్టూడియోస్‌లో 20 కోట్ల సెట్ లో నాగబంధం క్లైమాక్స్

Monalisa: కుంభమేళా ఫేమ్ మోనాలిసా లైఫ్ సినిమా షూటింగ్ పూర్తి

Pothana Hema: దుఃఖాన్ని బలంగా మార్చుకుని ముందుకుసాగుతున్న పోతన హేమ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

తర్వాతి కథనం
Show comments