Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆవు పేడను దొంగిలించిన ప్రభుత్వ ఉద్యోగి అరెస్ట్

Webdunia
బుధవారం, 6 ఫిబ్రవరి 2019 (14:31 IST)
సాధారణంగా ఆవు పేడను వ్యవసాయానికి, ఆయుర్వేదంలో విరివిగా ఉపయోగిస్తుంటారు. ఇప్పటికీ ఆవు పేడకు ఇప్పటికీ డిమాండ్ ఉంది. అయితే ఓ ప్రభుత్వ ఉద్యోగి ఆవు పేడను దొంగిలించాడు. వివరాల్లోకెళితే, కర్ణాటక బీరూర్ జిల్లాలో పశు సంరక్షణ విభాగానికి చెందిన ఆవు పేడ చోరీకి గురైంది. దాదాపు రూ.1.25 లక్షలు విలువ చేసే ఆవు పేడ చోరీకి గురైనట్టు బీరూర్ పోలీసులకు ఫిర్యాదు అందింది. 
 
పశు సంరక్షణ విభాగం డైరెక్టర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అమృత్ మహల్ కవల్ స్టాక్‌లో నిల్వ ఉంచిన 35 నుంచి 40 ట్రాక్టర్ల ఆవు పేడను పశు సంరక్షణ విభాగంలో పని చేస్తున్న సూపర్‌వైజర్ దొంగిలించినట్లు పోలీసుల విచారణలో బయటపడింది. ఆవు పేడ విలువ దాదాపు రూ.1.25 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. ఆవు పేడను స్వాధీనం చేసుకున్న పోలీసులు సూపర్‌వైజర్‌ని అదుపులోకి తీసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జై శ్రీరామ్ అంటూ తన్మయంతో డాన్స్ చేసిన మెగాస్టార్ చిరంజీవి

Indraganti: సారంగపాణి జాతకం చూసేందుకు డేట్ ఫిక్స్ చేసిన నిర్మాత

వేర్వేరు లక్ష్యాలతో ఉన్నఇద్దరి ప్రేమ కథతో డియర్ ఉమ విడుదలకు సిద్ధమైంది

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments