స్వీపర్ పోస్టులకు పీజీ- బీటెక్ - ఎంటెక్ విద్యార్థుల పోటాపోటీ

Webdunia
బుధవారం, 6 ఫిబ్రవరి 2019 (14:27 IST)
ఒకపుడు బీటెక్, ఎంటెక్ కోర్సులు పూర్తి చేస్తే ఖచ్చితంగా ఐటీ ఉద్యోగం ఖాయమని భావించేవారు. వీలైతే స్వదేశం లేదా విదేశాల్లోలోని పేరుమోసిన ఐటీ కంపెనీల్లో ఉద్యోగం వస్తుందని నమ్మేవారు. కానీ, ఇపుడు పరిస్థితి ఇపుడు తారుమారైంది. ఈ కోర్సులు పూర్తి చేసిన పట్టభద్రులు ఇపుడు నిరుద్యోగులుగా ఉన్నారు. పైగా, స్వీపర్ పోస్టులకు సైతం దరఖాస్తు చేసుకుంటున్నారు. 
 
తాజాగా తమిళనాడు రాష్ట్ర శాసనసభలో ఖాళీగా 14 శానిటరీ పోస్టుల కోసం ఇటీవల నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. ఈ పోస్టుల కోసం పదో తరగతి ఫెయిల్ అయిన నిరుద్యోగులతో పాటు.. బీటెక్, ఎంటెక్ పూర్తి చేసిన నిరుద్యోగులు సైతం దరఖాస్తు చేసుకున్నారు. 
 
అంతేనా, ఎంబీఏ, పీజీ, డిప్లొమోలు పూర్తి చేసిన వారు సైతం దరఖాస్తు చేసుకున్నారు. ఈ 14 పోస్టుల కోసం ఇప్పటికే 3900కి పైగా దరఖాస్తులు వచ్చాయి. ఇది దేశంలో నిరుద్యోగం ఏ స్థాయిలో ఉందో నిరూపిస్తోంది. పైగా, స్వీపర్ పోస్టుకు ఎంపికయ్యే వారికి నెలకు రూ.17 వేలు వేతనం ఇవ్వనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pooja Hegde :వర్షం, పర్వత ప్రాంత ప్రార్థనాల మధ్య దుల్కర్ సల్మాన్, పూజా హెగ్డే చిత్రం షూట్

Laya: జగపతి బాబు, లయల మధ్య ఫ్యామిలీ కెమిస్ట్రీ తో వదలా నుంచి మెలోడీ సాంగ్

Sunil : పుష్ప తర్వాత నా లైఫ్ సర్‌ప్రైజింగ్ మోడ్‌లో పడింది. : సునీల్

Manoj Manchu: సెలెబ్రిటీతో పునర్జన్మ ఛాలెంజ్ ను స్వీకరించిన మనోజ్ మంచు

తర్వాతి కథనం
Show comments