Webdunia - Bharat's app for daily news and videos

Install App

కర్నాటకలో కావేరీ సెగలు.. స్తంభించిన జనజీవనం

Webdunia
శుక్రవారం, 29 సెప్టెంబరు 2023 (12:56 IST)
కావేరీ జలాలను తమిళనాడు రాష్ట్రానికి విడుదల చేయడాన్ని నిరసిస్తూ కర్నాటక రాష్ట్రంలో శుక్రవారం బందా పాటిస్తున్నారు. ఈ కారణంగా జనజీవనం స్తంభించిపోయింది. బెంగుళూరు, మైసూర్, మాండ్యా తదితర ప్రాంతాల్లో ఈ బంద్ ప్రభావం అధికంగా కనిపిస్తుంది. ఈ బంద్ కారణంగా వ్యాపార సంస్థలు, హోటల్లు, విద్యా సంస్థలన్నీ మూతపడ్డాయి. బంద్‌కు దాదాపు 2 వేలకు పైగా సంస్థలు మద్దతు ప్రకటించాయి. బెంగూళూరు విమానాశ్రయం నుంచి దాదాపు 44 వరకు విమాన సర్వీసులు రద్దయ్యాయి. 
 
కావేరీ జలాలను తమిళనాడుకు విడుదల చేయడాన్ని వ్యతిరేకిస్తూ కన్నడ ఒక్కుట సంస్థ ఈ బంద్‌కు పిలుపునిచ్చింది. ఎన్నో సంఘాలతో కూడిన ఉమ్మడి వేదికే కన్నడ ఒక్కుట. అయితే, ఈ బంద్ ప్రభావం అత్యధికంగా బెంగుళూరులోని కనపిస్తుంది. ప్రజల రవాణాకు తీవ్ర అంతరాయం కలిగింది. 
 
కన్నడ ఒక్కుట సంస్థ కార్యకర్తలు విమానాశ్రయంలోకి చొచ్చుకుని పోయేందుకు ప్రయత్నించగా, వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో విమాన సర్వీసులను ఆయా సంస్థలు రద్దు చేయాయి. అలాగే, ప్రైవేటు, ప్రభుత్వ రవాణా సౌకర్యాలు అందుబాటులో లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments