Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్‌పై కౌంటర్లు సంధిస్తా.. సెల్ఫీలు దిగేవారంతా ఓట్లేయరు : సాయికుమార్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కర్ణాటక ఎన్నికల ప్రచారం చేస్తే ఆయనపై కౌంటర్లు వేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సినీ నటుడు, డైలాగ్ కింగ్ సాయి కుమార్ తెలిపారు. ఇదే అంశ

Webdunia
శుక్రవారం, 4 మే 2018 (09:01 IST)
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కర్ణాటక ఎన్నికల ప్రచారం చేస్తే ఆయనపై కౌంటర్లు వేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సినీ నటుడు, డైలాగ్ కింగ్ సాయి కుమార్ తెలిపారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, సినీ తారల ప్రచారానికి ఓట్లు రాలవని వ్యాఖ్యానించారు.
 
ఎన్నికల ప్రచారాల్లో పాల్గొనే ప్రముఖులతో సెల్ఫీలు దిగేందుకే ప్రజలకు ఆసక్తి కనబరుస్తారని అన్నారు. ప్రజల్లోకి నేరుగా చొచ్చుకుపోయే అతిపెద్ద మీడియా 'సినిమా'నే అని ఆయన చెప్పారు. సినీ తారలతో రోడ్ షో‌లు నిర్వహించడం వల్ల ఫలితం ఉండదన్నారు. తటస్థ ఓటర్లను ఆకర్షించడంతో పాటు సంప్రదాయ బీజేపీ ఓటు బ్యాంకుతో తాను విజయం సాధించడం ఖాయమని సాయికుమార్ ధీమా వ్యక్తం చేశారు.
 
ఈ ఎన్నికల్లో సాయి కుమార్ కర్ణాటక రాష్ట్రంలోని బాగేపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఇక్కడ 90 శాతం మంది తెలుగు ప్రజలే నివశిస్తున్నారు. పైగా, ఈ స్థానం అనంతపురం జిల్లాను ఆనుకునివుంది. దీంతో సాయికుమార్ విజయంపై ధీమాను వ్యక్తం చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యూనియన్లు కార్మికులనుంచి లక్షలు దోచేస్తున్నాయ్ : ఫిలిం ఛాంబర్ విమర్శ

పవన్ కళ్యాణ్ షూటింగ్ లో సినీ కార్మికుల ధర్నా - పోలీసు బందోబస్త్ ఏర్పాటు చేసిన నిర్మాతలు

Sonakshi Sinha: సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా థ్రిల్లర్ జటాధర.. థండరస్ లుక్

నా తలపై జుట్టంతా ఊడిపోయింది.. నీవు మాత్రం అలాగే ఎలా ఉన్నావయ్యా? రజనీకాంత్

నేచురల్ స్టార్ నాని క్లాప్ తో దుల్కర్ సల్మాన్ 41వ చిత్రం ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments