Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో నిరుద్యోగులకు శుభవార్త... డిగ్రీ పట్టభద్రులకు ఆర్థిక భరోసా

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అధికార తెలుగుదేశం పార్టీ మరో ఎన్నికల హామీని నెరవేర్చేందుకు సిద్ధమైంది. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు.. నిరుద్యోగ భృతి అందజేయాలని నిర్ణయించింది. డిగ్రీ పూర్తి చేసిన ప్రతి ని

Webdunia
శుక్రవారం, 4 మే 2018 (08:53 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అధికార తెలుగుదేశం పార్టీ మరో ఎన్నికల హామీని నెరవేర్చేందుకు సిద్ధమైంది. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు.. నిరుద్యోగ భృతి అందజేయాలని నిర్ణయించింది. డిగ్రీ పూర్తి చేసిన ప్రతి నిరుద్యోగుడికి ఈ భృతి అందనుంది.
 
ఇదే అంశంపై ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ, నిరుద్యోగ భృతితో ఏపీలో నిరుద్యోగ యువతకు ఆర్థిక భరోసా కల్పించాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని, ఇందుకోసం ఎన్ని వందల కోట్లయినా కేటాయిస్తామన్నారు. తొలి దశలో 10 లక్షల మందికి నిరుద్యోగ భృతి కల్పించనున్నామని తెలిపారు. ఎన్నికల మేనిఫెస్టో అమలులో భాగంగా రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఆర్థిక భరోసా కల్పించేలా నిరుద్యోగ భృతి అందించాలని నిర్ణయించిందన్నారు. ఇందుకోసం బడ్జెట్‌లో రూ.1000 కోట్లు కేటాయించామన్నారు. 
 
ఈ నెలాఖారులోగా పూర్తిస్థాయిలో విధివిధానాలను రూపొందించాలని అధికారులను యనమల ఆదేశించారు. అర్హుల వయస్సు, విద్యార్హతలపై చర్చించారు. డిగ్రీ పూర్తి చేసిన వారినే అర్హులుగా గుర్తించాలని మంత్రివర్గ ఉప సంఘం నిర్ణయించింది. అలాగే, నిరుద్యోగ భృతి అందుకునే యువతకు పలు రంగాల్లో శిక్షణనిచ్చి, రాష్ట్రంలో విస్తృతంగా ఏర్పాటవుతోన్న పరిశ్రమల్లో ఉపాధి అవకాశాలు కల్పించాలని మంత్రులు నిర్ణయించారు. ఉపాధి కల్పించిన వెంటనే వారిని నిరుద్యోగ భృతి పథకం నుంచి మినహాయిస్తామని, వారి స్థానంలో కొత్త వారికి అవకాశమిస్తామని ఆయన వివరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments