Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళా ఉద్యోగులపై వరాల జల్లు.. ఆరు నెలల పాటు చైల్డ్ కేర్ లీవులు

Webdunia
మంగళవారం, 9 మార్చి 2021 (11:21 IST)
కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప మహిళా ఉద్యోగులపై వరాల జల్లు కురిపించారు. ప్రభుత్వ ఉద్యోగినులకు ఆరు నెలల పాటు చైల్డ్ కేర్ లీవ్ ఇచ్చేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు. మహిళలకు సంబంధించిన వివిధ కార్యక్రమాలకు రూ. 37,188 కోట్లు విడుదల చేస్తామని అయన పేర్కొన్నారు. 
 
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ప్రవేశపెట్టిన సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ.. పట్టణాల్లోని వర్కింగ్ ఉమెన్ సౌకర్యం కోసం బెంగళూరు సహా ఇతర ప్రాంతాల్లోని అంగన్వాడీలను క్రీచ్‌లుగా మార్చుతున్నట్టు ఆయన తెలిపారు. ప్రతి జిల్లా కేంద్రంలోనూ రెండు ముఖ్యమైన ప్రభుత్వ కార్యాలయాల్లో క్రీచ్‌లను ప్రారంభించడానికి చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి వెల్లడించారు. 
 
''రాష్ట్రంలోని మహిళా ఉద్యోగులకు ఇప్పటికే ఉన్న మెటర్నిటీ సెలవులతో పాటు ఆరు నెలల పాటు చైల్డ్ కేర్ సెలవును కూడా ఇస్తాం. పరిపాలనా యంత్రాంగంలో ముఖ్య పాత్ర పోషిస్తున్న మహిళల సంక్షేమం కోసం ఈ నిర్ణయం తీసుకుంటున్నాం...'' అని యడ్యూరప్ప పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan Kalyan: హరిహరవీరమల్లు కథ రివీల్ చేస్తూ రిలీజ్ డేట్ ప్రకటన

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

తెలుగు సాహిత్యం, వాడుక భాష‌మీదా పట్టుున్న హాస్య‌బ్రహ్మ’ జంధ్యాల

తన పేరుతో ఉన్న పులిని కలిసిన రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కుమార్తె క్లీంకార

Surya: సూర్య, ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ కరుప్పు లుక్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments