Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళా ఉద్యోగులపై వరాల జల్లు.. ఆరు నెలల పాటు చైల్డ్ కేర్ లీవులు

Webdunia
మంగళవారం, 9 మార్చి 2021 (11:21 IST)
కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప మహిళా ఉద్యోగులపై వరాల జల్లు కురిపించారు. ప్రభుత్వ ఉద్యోగినులకు ఆరు నెలల పాటు చైల్డ్ కేర్ లీవ్ ఇచ్చేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు. మహిళలకు సంబంధించిన వివిధ కార్యక్రమాలకు రూ. 37,188 కోట్లు విడుదల చేస్తామని అయన పేర్కొన్నారు. 
 
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ప్రవేశపెట్టిన సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ.. పట్టణాల్లోని వర్కింగ్ ఉమెన్ సౌకర్యం కోసం బెంగళూరు సహా ఇతర ప్రాంతాల్లోని అంగన్వాడీలను క్రీచ్‌లుగా మార్చుతున్నట్టు ఆయన తెలిపారు. ప్రతి జిల్లా కేంద్రంలోనూ రెండు ముఖ్యమైన ప్రభుత్వ కార్యాలయాల్లో క్రీచ్‌లను ప్రారంభించడానికి చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి వెల్లడించారు. 
 
''రాష్ట్రంలోని మహిళా ఉద్యోగులకు ఇప్పటికే ఉన్న మెటర్నిటీ సెలవులతో పాటు ఆరు నెలల పాటు చైల్డ్ కేర్ సెలవును కూడా ఇస్తాం. పరిపాలనా యంత్రాంగంలో ముఖ్య పాత్ర పోషిస్తున్న మహిళల సంక్షేమం కోసం ఈ నిర్ణయం తీసుకుంటున్నాం...'' అని యడ్యూరప్ప పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దక్షిణాదిలో గుడికట్టాలంటూ డిమాండ్ చేస్తున్న బాలీవుడ్ హీరోయిన్! (Video)

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments