రైల్వే స్టేషన్లలో ఫ్లాట్‌ఫాం టికెట్‌ బాదుడు : బోర్డులో రూ.10 .. పెన్నుతో రూ.30

Webdunia
మంగళవారం, 9 మార్చి 2021 (11:17 IST)
హైదరాబాద్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లల ప్లాట్‌ఫాం టికెట్‌ ధరలను ఒక్కసారిగా పెంచేశారు. దేశవ్యాప్తంగా రూ.10గా ఉన్న ధరను ఆయా స్టేషన్ల రద్దీకనుగుణంగా రూ.30 వరకు పెంచుకునే అవకాశం ఇవ్వడంతో.. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్లో రూ.10 నుంచి రూ.30 అయ్యింది. 
 
హైదరాబాద్‌లో రూ.20కి పెంచారు. కాచిగూడలో మాత్రం రూ.10 ఉంది. మౌలాలి, మల్కాజిగిరి, లింగంపల్లి రైల్వేస్టేషన్లలోనూ రూ.10గానే ఉంది. నగరంలోని మూడు రైల్వేస్టేషన్లలో కరోనాకు ముందు రోజూ దాదాపు 25 వేల ప్లాట్‌ఫాం టిక్కెట్లు అమ్ముడయ్యేవి. పెరిగిన ధరలతో రైల్వేకు రోజుకు రూ.7.10 లక్షల వరకూ ఆదాయం సమకూరే అవకాశం ఉంది!
 
సికింద్రాబాద్‌, హైదరాబాద్‌ రైల్వేస్టేషన్లలో సోమవారం నుంచి ప్లాట్‌ఫాం టిక్కెట్ల విక్రయం ప్రారంభించారు. ముందస్తు సూచన లేకుండానే సోమవారం నుంచి పెంచిన ధరలను అమల్లోకి తీసుకొచ్చారు. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషనులో కౌంటర్‌ బోర్డుపై రూ.10 అని రాసిన పాత ధరల పట్టిక అలాగే ఉంది. 
 
కింద కౌంటర్‌ కిటికీ దగ్గర కాగితంపై రూ.30 అని రాసి.. అమ్మకాలు ప్రారంభించారు. ఈ విషయాన్ని గుర్తించి కొందరు వాదులాటకు దిగారు.  ఉన్నతాధికారులు స్పందిస్తూ.. కరోనా నేపథ్యంలో రద్దీని తగ్గించడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. కరోనాతగ్గిన తర్వాత ధరలు తగ్గుతాయా? అంటే వారి దగ్గర సమాధానం లేకపోయింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Raai Lakshmi :సెక్సువల్‌ హరాస్‌మెంట్‌కు పోరాడిన మహిళ గా రాయ్‌ లక్ష్మీ

Chiranjeevi : అనిల్ రావిపూడి కి షూటింగ్ లో షాక్ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి ?

మేఘన కు నా పర్సనల్ లైఫ్ కు చాలా పోలికలు ఉన్నాయి : రాశీ సింగ్

Balakrishna: ఇదంతా ప్రకృతి శివుని ఆజ్ఞ. అఖండ పాన్ ఇండియా సినిమా : బాలకృష్ణ

ఆదిత్య 999 మ్యాక్స్‌లో మోక్షజ్ఞ.. బాలయ్య కూడా నటిస్తారట.. ఫ్యాన్స్ ఖుషీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments