Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైల్వే స్టేషన్లలో ఫ్లాట్‌ఫాం టికెట్‌ బాదుడు : బోర్డులో రూ.10 .. పెన్నుతో రూ.30

Webdunia
మంగళవారం, 9 మార్చి 2021 (11:17 IST)
హైదరాబాద్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లల ప్లాట్‌ఫాం టికెట్‌ ధరలను ఒక్కసారిగా పెంచేశారు. దేశవ్యాప్తంగా రూ.10గా ఉన్న ధరను ఆయా స్టేషన్ల రద్దీకనుగుణంగా రూ.30 వరకు పెంచుకునే అవకాశం ఇవ్వడంతో.. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్లో రూ.10 నుంచి రూ.30 అయ్యింది. 
 
హైదరాబాద్‌లో రూ.20కి పెంచారు. కాచిగూడలో మాత్రం రూ.10 ఉంది. మౌలాలి, మల్కాజిగిరి, లింగంపల్లి రైల్వేస్టేషన్లలోనూ రూ.10గానే ఉంది. నగరంలోని మూడు రైల్వేస్టేషన్లలో కరోనాకు ముందు రోజూ దాదాపు 25 వేల ప్లాట్‌ఫాం టిక్కెట్లు అమ్ముడయ్యేవి. పెరిగిన ధరలతో రైల్వేకు రోజుకు రూ.7.10 లక్షల వరకూ ఆదాయం సమకూరే అవకాశం ఉంది!
 
సికింద్రాబాద్‌, హైదరాబాద్‌ రైల్వేస్టేషన్లలో సోమవారం నుంచి ప్లాట్‌ఫాం టిక్కెట్ల విక్రయం ప్రారంభించారు. ముందస్తు సూచన లేకుండానే సోమవారం నుంచి పెంచిన ధరలను అమల్లోకి తీసుకొచ్చారు. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషనులో కౌంటర్‌ బోర్డుపై రూ.10 అని రాసిన పాత ధరల పట్టిక అలాగే ఉంది. 
 
కింద కౌంటర్‌ కిటికీ దగ్గర కాగితంపై రూ.30 అని రాసి.. అమ్మకాలు ప్రారంభించారు. ఈ విషయాన్ని గుర్తించి కొందరు వాదులాటకు దిగారు.  ఉన్నతాధికారులు స్పందిస్తూ.. కరోనా నేపథ్యంలో రద్దీని తగ్గించడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. కరోనాతగ్గిన తర్వాత ధరలు తగ్గుతాయా? అంటే వారి దగ్గర సమాధానం లేకపోయింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: మూర్తీభవించిన ధర్మాగ్రహం పవన్ కళ్యాణ్; ఐటంసాంగ్ వద్దన్నారు : ఎం.ఎం. కీరవాణి

ఎ.ఆర్. రెహమాన్ లా గాయకులతో హరి హర వీరమల్లు పాటను పాడించిన కీరవాణి

Saiyami Kher: కాస్టింగ్ కౌచ్ : టాలీవుడ్‌లో నన్ను ఆ ఏజెంట్ కలిసింది.. అడ్జెస్ట్ చేసుకోవాలని..?

బంగారం స్మగ్లింగ్ కేసు : రన్యారావుకు బెయిల్ అయినా జైల్లోనే...

నేను, నా భర్త విడిపోవడానికి మూడో వ్యక్తే కారణం : ఆర్తి రవి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments