Webdunia - Bharat's app for daily news and videos

Install App

దర్గా ఉర్సుకు వెళ్లి వస్తూ అనంతలోకాలకు చేరిన భక్తులు

Webdunia
మంగళవారం, 6 జూన్ 2023 (09:11 IST)
కర్నాటక రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాష్ట్రంలోని కలబురిగిలో దర్గా ఉర్సుకు వెళ్లి వస్తుండగా ఆగివున్న లారీని కారు ఒకటి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు ఏపీ వాసులు దుర్మరణం పాలయ్యారు. మృతులను నంద్యాల జిల్లా వెలుగోడుకు చెందిన వారిగా గుర్తించారు. ఈ ప్రమాదంలో మరో 13 మందికి గాయాలయ్యాయి. 
 
నంద్యాల జిల్లా వెలుగోడుకు చెందిన కొందరు కలబురిగిలోని దర్గా ఉర్సుకు వెళ్లి తిరిగి వస్తున్నారు. వీరి జీపు అదుపు తప్పి రోడ్డు పక్కన ఆగివున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదం యాదగిరి జిల్లాలో జరిగింది. ఆగివున్న లారీని జీపును బలంగా ఢీకొట్టడంతో దుర్ఘటన స్థలంలోనే ఐదుగురు మృత్యువాతపడగా, మరో 13 మంది గాయపడ్డారు. 
 
ప్రాణాలు కోల్పోయిన వారిలో మునీర్ (40), నయామిత్ (40), రమీజా బేగం (50), ముద్దతే షీర్ (12), సుమ్మి (13)లు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి  చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ వార్త తెలియగానే వెలుగోడులో విషాద చాయలు అలముకున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments