Webdunia - Bharat's app for daily news and videos

Install App

దర్గా ఉర్సుకు వెళ్లి వస్తూ అనంతలోకాలకు చేరిన భక్తులు

Webdunia
మంగళవారం, 6 జూన్ 2023 (09:11 IST)
కర్నాటక రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాష్ట్రంలోని కలబురిగిలో దర్గా ఉర్సుకు వెళ్లి వస్తుండగా ఆగివున్న లారీని కారు ఒకటి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు ఏపీ వాసులు దుర్మరణం పాలయ్యారు. మృతులను నంద్యాల జిల్లా వెలుగోడుకు చెందిన వారిగా గుర్తించారు. ఈ ప్రమాదంలో మరో 13 మందికి గాయాలయ్యాయి. 
 
నంద్యాల జిల్లా వెలుగోడుకు చెందిన కొందరు కలబురిగిలోని దర్గా ఉర్సుకు వెళ్లి తిరిగి వస్తున్నారు. వీరి జీపు అదుపు తప్పి రోడ్డు పక్కన ఆగివున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదం యాదగిరి జిల్లాలో జరిగింది. ఆగివున్న లారీని జీపును బలంగా ఢీకొట్టడంతో దుర్ఘటన స్థలంలోనే ఐదుగురు మృత్యువాతపడగా, మరో 13 మంది గాయపడ్డారు. 
 
ప్రాణాలు కోల్పోయిన వారిలో మునీర్ (40), నయామిత్ (40), రమీజా బేగం (50), ముద్దతే షీర్ (12), సుమ్మి (13)లు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి  చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ వార్త తెలియగానే వెలుగోడులో విషాద చాయలు అలముకున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లావణ్యతో సహజీవనం చేసిన మాట వాస్తమే.. పెళ్లి చేసుకుంటానని హామీ ఇవ్వలేదు : హీరో రాజ్ తరుణ్

కల్కి చిత్రంపై విమర్శలకు నాగ్ అశ్విన్ మైండ్ బ్లోయింగ్ స్టేట్ మెంట్ !

శనివారాల్లో వైలెంట్ గా వుండే సూర్య కథే సరిపోదా శనివారం !

క‌మ‌ల్ హాస‌న్‌, శంకర్ ల భారతీయుడు 2 ప్రీ రిలీజ్ ఈసారి హైద‌రాబాద్‌లో

డెడ్‌పూల్ & వుల్వరైన్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఆఫ్ ది ఇయర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పప్పు ఎందుకు తినాలో తెలుసా?

తట్టుకోలేని మైగ్రేన్ తలనొప్పి, ఈ చిట్కాలతో చెక్

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: బాదంపప్పుతో మీ చర్మానికి సంపూర్ణ పోషణ

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments