Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆకలితో చస్తుంటే.. రూ.వెయ్యి కోట్లతో పార్లమెంట్ భవనం అవసరమా?

Webdunia
ఆదివారం, 13 డిశెంబరు 2020 (14:26 IST)
కేంద్ర ప్రభుత్వం కొత్త పార్లమెంట్ భవనాన్ని నిర్మించనుంది. ఇందుకోసం రూ.1000 కోట్లు ఖర్చు చేయనుంది. దీనిపై విమర్శలు వస్తున్నాయి. ఒకవైపు, కరోనా వైరస్ లాక్డౌన్ కారణంగా వ్యవస్థలన్నీ స్తంభించిపోయాయి. లాక్డౌన్ అన్‌లాక్ తర్వాత ఇపుడిపుడే కుదుటపడుతున్నాయి. లక్షలాది మంది ఉపాధిని కోల్పోయారు. అనేక మంది ఆకలితో అలమటిస్తున్నారు. పేద, మధ్యతరగతి ప్రజలు ఉపాధి లేక తల్లడిల్లిపోతున్నారు. ఉపాధి కల్పోయిన అనేక కుటుంబాలు జీవనం సాగించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. 
 
ఈ క్రమంలో రూ.వెయ్యి కోట్లతో కేంద్ర ప్రభుత్వం కొత్త పార్లమెంట్ భవనాన్ని నిర్మించనుంది. ఇందుకోసం ఈ నెల పదో తేదీన ప్రధాని నరేంద్ర మోడీ భూమిపూజ కూడా చేశారు. సెంట్రల్ విస్టా పేరుతో కేంద్రం నూతన పార్లమెంటు సముదాయ నిర్మాణాన్ని చేపట్టనున్నారు. దీనిపై మక్కల్ నీది మయ్యం అధ్యక్షుడు కమల్ హాసన్ విమర్శలు గుప్పించారు.  
 
కరోనా దెబ్బకు దేశంలో సగం మంది ఉపాధి కోల్పోయి ఆకలితో అల్లాడుతుంటే, ఎవరైనా రూ.1000 కోట్లతో పార్లమెంటు భవనం కడతారా? అంటూ మండిపడ్డారు. చైనాలో గ్రేట్ వాల్ నిర్మాణ సమయంలో వేలమంది ప్రజలు చనిపోయారని, అయితే ఆ గోడ నిర్మిస్తోంది ప్రజలను రక్షించడానికేనని అప్పటి రాజులు చెప్పారని కమల్ ప్రస్తావించారు. ఇప్పటి భారత పాలకుల తీరు కూడా అలాగే ఉందని విమర్శించారు. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments