Webdunia - Bharat's app for daily news and videos

Install App

కళ్లకురిచిలో ఘటన.. హాస్టల్‌ ప్రాంగణంలో బాలిక శవం.. ఏం జరిగింది?

Webdunia
సోమవారం, 18 జులై 2022 (16:18 IST)
Kallakurichi
తమిళనాడులో దారుణ ఘటన జరిగింది. కళ్లకురిచికి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిన్నసేలంలోని ఓ ప్రైవేట్ రెసిడెన్షియల్ పాఠశాలలో షాకింగ్ సంఘటన జరిగింది. 12వ తరగతి చదువుతున్న 17 ఏళ్ల బాలిక జూలై 13న హాస్టల్ ప్రాంగణంలో శవమై కనిపించింది. 
 
కాగా, బాలిక హాస్టల్‌లోని మూడో అంతస్తులోని ఓ గదిలోని బాల్కనీ నుంచి నేలపైకి దూకి తన జీవితాన్ని ముగించుకుందని అనుమానిస్తున్నారు. మరణానికి ముందు ఆమెకు గాయాలైనట్లు పోస్టుమార్టం నివేదికలో తేలింది. అయితే, బాలిక చనిపోవడం వెనుక హాస్టల్ సిబ్బంది ఏవైనా ఉన్నాయా అని బాధిత బాలిక బంధువులు అనుమానించారు.
 
దీంతో.. ఆదివారం గ్రామస్తులతో కలిసి మూకుమ్మడిగా పాఠశాలలో ప్రవేశించి, అక్కడి బస్సులను తగులబెట్టారు. ఆమె మరణంతో దిగ్భ్రాంతికి గురైన ఆమె తల్లిదండ్రులు, బంధువులు, కడలూరు జిల్లా వేప్పూర్‌లోని పెరియనాసలూరు గ్రామం ప్రజలు న్యాయం చేయాలని కోరుతూ నిరంతరాయంగా నిరసనలు చేస్తున్నారు. 
 
విద్యార్థి తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు 'అంతర్జాతీయ' పాఠశాల అధికారులను నిందించారు. వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

తర్వాతి కథనం
Show comments