Webdunia - Bharat's app for daily news and videos

Install App

తండ్రి చనిపోయారు... కానీ ఆయన నిర్దోషి అని నిరూపించేందుకు పోరాడిన సంతానం...

Judgement
Webdunia
మంగళవారం, 5 మార్చి 2019 (20:34 IST)
లంచం కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న ఓ డాక్టర్ నిర్దోషి అని బాంబే హైకోర్టు తీర్పునిచ్చింది. కాకపోతే చాలా ఆలస్యంగా సదరు వ్యక్తికి న్యాయం లభించింది. కేసు నమోదై 32 సంవత్సరాలు గడిచిన తర్వాత కోర్టులో ఇప్పుడు ఆయన నిర్దోషిత్వం రుజువైంది. కానీ తీర్పు వినడానికి ఆయన లేరు. నాలుగేళ్ల క్రితం కాలం చేసారు. నిశికాంత్ కులకర్ణి అనే ఆ వైద్యుడు మహారాష్ట్రలోని మన్మాడ్ మునిసిపాలిటీ హాస్పిటల్‌లో మెడికల్ ఆఫీసర్‌గా పనిచేసేవారు. 
 
వంద రూపాయలు తీసుకుని డెత్ సర్టిఫికేట్ ఇచ్చారని ఆయనపై 1987 సెప్టెంబర్‌లో కేసు నమోదైంది. అయితే ఓ వ్యక్తి తన సోదరుని మరణ ధృవీకరణ పత్రం కోసం నిశికాంత్ 150 రూపాయల లంచం అడిగినట్లు, చివరకు 100 రూపాయలకు బేరం కుదిరిందని ఏసీబీకి ఫిర్యాదు చేసాడు. ఈ కేసుపై సెషన్స్ కోర్టు 2005లో తీర్పు చెప్పింది. డాక్టర్‌కు ఒక ఏడాది, ప్యూనుకు ఆరునెలల శిక్ష పడింది. 
 
కాగా లంచం తీసుకుంది ప్యూను కాబట్టి నిందితులు దీనిపై హైకోర్టుకు వెళ్లారు. కేసు నడుస్తుండగానే డాక్టరు వృద్ధాప్యం వల్ల చనిపోయాడు. ఆయన కుటుంబ సభ్యులు మాత్రం ఆయన నిర్దోషిత్వాన్ని రుజువు చేయాలనే పట్టుదలతో హైకోర్టులో కేసును కొనసాగించారు. చివరకు విజయం సాధించారు. కాగా ఆ విజయాన్ని చూసుకునేందుకు ఆ డాక్టరు లేకపోవడం విచారకరం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

పాకిస్థాన్ నటుడు నటించిన "అబీర్ గులాల్‌"పై కేంద్రం నిషేధం!

Rowdy Wear : రౌడీ వేర్ ఆఫ్ లైన్ స్టోర్ కోసం డిమాండ్ ఉంది : విజయ్ దేవరకొండ

నేను పాకిస్థాన్ అని ఎవరు చెప్పారు...: నెటిజన్లకు ఇమాన్వీ ప్రశ్న

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments