Webdunia - Bharat's app for daily news and videos

Install App

జర్నలిస్టులకు కేంద్రం వార్నింగ్... ఏంటా హెచ్చరిక?

దేశంలో వివిధ సంస్థల్లో పని చేసే పాత్రికేయులకు కేంద్ర ప్రభుత్వం గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. తప్పుడు వార్తలు రాసినా, ప్రసారం చేసినా... జర్నలిస్టు అక్రిడిటేషన్‌ను శాశ్వతంగా రద్దు చేస్తామని కేంద్ర ప్రభుత్

Webdunia
మంగళవారం, 3 ఏప్రియల్ 2018 (12:41 IST)
దేశంలో వివిధ సంస్థల్లో పని చేసే పాత్రికేయులకు కేంద్ర ప్రభుత్వం గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. తప్పుడు వార్తలు రాసినా, ప్రసారం చేసినా... జర్నలిస్టు అక్రిడిటేషన్‌ను శాశ్వతంగా రద్దు చేస్తామని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. 
 
తప్పుడు వార్తలు రాసిన లేదా ప్రసారం చేసినట్లు తేలితే... తప్పుడు వార్తలు రాసిన జర్నలిస్టు గుర్తింపును నోటీసు ఇచ్చి ఆరునెలల పాటు రద్దు చేస్తారు. మళ్లీ రెండో సారి కూడా తప్పుడు వార్తలు రాస్తే మరో సంవత్సరం పాటు అక్రిడిటేషన్‌ను రద్దు చేస్తారు. 
 
ఇలా మూడోసారి కూడా తప్పుడు వార్తలు రాసినా, ప్రసారం చేసిన అలాంటి విలేకరుల అక్రిడిటేషన్ (గుర్తింపు)ను శాశ్వతంగా రద్దు చేయాలని సర్కారు నిర్ణయించింది. 
 
తప్పుడు వార్తలపై ఫిర్యాదులను ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, ఎలక్ట్రానిక్ మీడియా ఫిర్యాదులను న్యూస్ బ్రాడ్ కాస్టర్స్ అసోసియేషన్‌కు పంపించాలని సర్కారు నిర్ణయించింది. ఫిర్యాదులను పీసీఐ, ఎన్బీఏలు పరిశీలించి 15 రోజుల్లో నిర్ణయాన్ని వెల్లడించాలని కేంద్రం కోరింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments