Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మీడియాకు రోజా క్లాస్... ఆ రెండు పత్రికల వాళ్లెక్కడంటూ ప్రశ్న(వీడియో)

మీరు జర్నలిస్టులా... నేను ఒకటి చెబితే మీరొకటి రాస్తారా.. ఎందుకు అలా రాస్తున్నారో నాకైతే అర్థం కావడం లేదు. ఇలా రాయడం మానుకోండి. తిరుమల శ్రీవారి దర్శన బ్రేక్ టిక్కెట్ల వ్యవహారంపై నేను ప్రశ్నించాను. తిరుమల జెఈఓగా శ్రీనివాసరాజు బాధ్యతలు చేపట్టిన తరువాత త

మీడియాకు రోజా క్లాస్... ఆ రెండు పత్రికల వాళ్లెక్కడంటూ ప్రశ్న(వీడియో)
, మంగళవారం, 12 డిశెంబరు 2017 (14:46 IST)
మీరు జర్నలిస్టులా... నేను ఒకటి చెబితే మీరొకటి రాస్తారా.. ఎందుకు అలా రాస్తున్నారో నాకైతే అర్థం కావడం లేదు. ఇలా రాయడం మానుకోండి. తిరుమల శ్రీవారి దర్శన బ్రేక్ టిక్కెట్ల వ్యవహారంపై నేను ప్రశ్నించాను. తిరుమల జెఈఓగా శ్రీనివాసరాజు బాధ్యతలు చేపట్టిన తరువాత తిరుమల సేవా టిక్కెట్ల వ్యవహారం వ్యాపార కేంద్రంగా మారిపోయింది. అదే నేను అడిగాను. నాకు ఇన్ని టిక్కెట్లు కావాలని ఎప్పుడూ అడగలేదు.
 
స్వామి చెంతకు వస్తే నేను ప్రశాంతంగా ఉంటాను. స్వామివారి ఆశీర్వాదం పొందాలని భావిస్తాను. అంతేగాని అనవసర మాటలను నేను మాట్లాడను. నేను మాట్లాడే మాటలను మార్చి రాస్తున్నారు. ఇలాంటివి మానుకోండి అంటూ జర్నలిస్టులను హెచ్చరించి మరీ వెళ్ళారు. పేరు పేరునా తనపైన వార్తలు రాసిన పత్రికా ప్రతినిధులను పిలిచి క్లాస్ పీకారు రోజా.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తల్లితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడనీ...