చంద్రబాబు సొంత నియోజకవర్గంలో రోజా - ఆ దమ్ముందా అంటూ సవాల్ (వీడియో)
ఎపి సిఎం చంద్రబాబునాయుడు ప్రజల నమ్మకాన్ని ఎప్పుడో పోగొట్టుకున్నారని విమర్శించారు వైసిపి ఎమ్మెల్యే రోజా. సిఎం నోరు తెరిస్తే అన్నీ అబద్ధాలేనన్నారు. చిత్తూరు జిల్లాలోని చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పంలో వైసిపి నిర్వహించిన రచ్చబండలో రోజా పాల్గొన
Publish Date: Mon, 27 Nov 2017 (21:30 IST)
Updated Date: Mon, 27 Nov 2017 (21:34 IST)
ఎపి సిఎం చంద్రబాబునాయుడు ప్రజల నమ్మకాన్ని ఎప్పుడో పోగొట్టుకున్నారని విమర్శించారు వైసిపి ఎమ్మెల్యే రోజా. సిఎం నోరు తెరిస్తే అన్నీ అబద్ధాలేనన్నారు. చిత్తూరు జిల్లాలోని చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పంలో వైసిపి నిర్వహించిన రచ్చబండలో రోజా పాల్గొన్నారు. సొంత నియోజకవర్గాన్నే అభివృద్థి చేయని ముఖ్యమంత్రి ఎపిని ఏం అభివృద్థి చేస్తారని ప్రశ్నించారామె. రచ్చబండలో కుప్పం నియోజకవర్గంలోని గ్రామ ప్రజలందరూ సమస్యలను తమ దృష్టికి తీసుకొస్తున్నారని, దీన్నిబట్టే అర్థమవుతుందని చంద్రబాబునాయుడు చేతకాని ముఖ్యమంత్రి అని ఎద్దేవా చేశారు.
వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీపైన, జగన్ ఇచ్చిన నవరత్నాల హామీలపైన ప్రజల్లో నమ్మకం పెరిగిందని, ఆ నమ్మకమే వచ్చే ఎన్నికల్లో వైసిపి గెలుపొందడానికి దోహదపడుతుందన్నారు. జగన్ పాదయాత్రను చూసి అధికార పార్టీ నేతలకు భయపట్టుకుందన్నారు. ఇప్పటికైనా చంద్రబాబుకు దమ్ముంటే అభివృద్థిని చేసి చూపించాలే గాని.. మాటలతో కోటలు కట్టడం మానాలన్నారు.