Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముహూర్తం సమయంలో బ్లాకౌట్ - మొబైల్ లైట్ల వెలుగులో పెళ్లి!!

ఠాగూర్
ఆదివారం, 11 మే 2025 (09:06 IST)
దేశ సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు కొన్ని సందర్భాల్లో సాధారణ జీనజీవనంపై ఊహించని ప్రభావం చూపుతాయి. అలాంటి ఓ సంఘటన రాజస్థాన్‌‍లో చోటుచేసుకుంది. భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తలు పెరుగుతున్న తరుణంలో ముందుజాగ్రత్త చర్యగా సరిహద్దు జిల్లాల్లో గురువారం రాత్రిపూట విద్యుత్ సరఫరాను పూర్తి నిలిపివేశారు. వైమానిక దాడుల నుంచి ప్రజలను కాపాడేందుకు అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. 
 
ఇదేసమయంలో జోధ్‌పూర్‌లోని పావ్టా ప్రాంతంలో ఓ వివాహం వేడుక జరుగుతోంది. కీలకమైన సప్తపది ఘట్టం ఆరంభమయ్యే సమయానికి విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో అంతా అధికారంలోకి జారుకుంది. ఈ ఊహించని పరిణామంతో పెళ్లి మండపంలో కాసేపు గందరగోళం నెలకొన్నప్పటికీ, పెళ్ళికి హాజరైన అతిథులు వెంటనే తేరుకున్నారు. తమ వద్దవున్న సెల్‌ఫోన్‌ లైట్లను ఆన్‌చేసి ఆ వెలుగులోనే వధువరూలతో ఏడడుగులు నడిపించారు. అనంతరం పురోహితుడు అదే మొబైల్ కాంతుల మధ్య మంత్రోచ్ఛారణ చేస్తూ మిగిలిన వివాహ క్రతువులను పూర్తి చేయించారు. 
 
ఈ సందర్భంగా వరుడు కుటుంబ సభ్యులు మాట్లాడుతూ, పెళ్లి తంతు కంటే దేశ భద్రతే తమకు అత్యంత ముఖ్యమని స్పష్టం చేశారు. క్లిష్టపరిస్థితుల్లనూ సంయమనం పాటిస్తూ అధికారుల సూచనలకు అనుగుణంగా వివాహాన్ని పూర్తి చేసుకోవడం విశేషం. ఈ ఘటన దేశ భద్రత పట్ల పౌరులున్న బాధ్యతను సహకారాన్ని తెలియజేస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments