Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముహూర్తం సమయంలో బ్లాకౌట్ - మొబైల్ లైట్ల వెలుగులో పెళ్లి!!

ఠాగూర్
ఆదివారం, 11 మే 2025 (09:06 IST)
దేశ సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు కొన్ని సందర్భాల్లో సాధారణ జీనజీవనంపై ఊహించని ప్రభావం చూపుతాయి. అలాంటి ఓ సంఘటన రాజస్థాన్‌‍లో చోటుచేసుకుంది. భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తలు పెరుగుతున్న తరుణంలో ముందుజాగ్రత్త చర్యగా సరిహద్దు జిల్లాల్లో గురువారం రాత్రిపూట విద్యుత్ సరఫరాను పూర్తి నిలిపివేశారు. వైమానిక దాడుల నుంచి ప్రజలను కాపాడేందుకు అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. 
 
ఇదేసమయంలో జోధ్‌పూర్‌లోని పావ్టా ప్రాంతంలో ఓ వివాహం వేడుక జరుగుతోంది. కీలకమైన సప్తపది ఘట్టం ఆరంభమయ్యే సమయానికి విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో అంతా అధికారంలోకి జారుకుంది. ఈ ఊహించని పరిణామంతో పెళ్లి మండపంలో కాసేపు గందరగోళం నెలకొన్నప్పటికీ, పెళ్ళికి హాజరైన అతిథులు వెంటనే తేరుకున్నారు. తమ వద్దవున్న సెల్‌ఫోన్‌ లైట్లను ఆన్‌చేసి ఆ వెలుగులోనే వధువరూలతో ఏడడుగులు నడిపించారు. అనంతరం పురోహితుడు అదే మొబైల్ కాంతుల మధ్య మంత్రోచ్ఛారణ చేస్తూ మిగిలిన వివాహ క్రతువులను పూర్తి చేయించారు. 
 
ఈ సందర్భంగా వరుడు కుటుంబ సభ్యులు మాట్లాడుతూ, పెళ్లి తంతు కంటే దేశ భద్రతే తమకు అత్యంత ముఖ్యమని స్పష్టం చేశారు. క్లిష్టపరిస్థితుల్లనూ సంయమనం పాటిస్తూ అధికారుల సూచనలకు అనుగుణంగా వివాహాన్ని పూర్తి చేసుకోవడం విశేషం. ఈ ఘటన దేశ భద్రత పట్ల పౌరులున్న బాధ్యతను సహకారాన్ని తెలియజేస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దిల్ రాజు కాదు... రన్నింగ్ రాజు : అనిల్ రావిపూడి (Video)

పారితోషికం కంటే పనిలో సంతృప్తి కి ప్రాధాన్యత: కిషోర్ బొయిదాపు

Nitin: సోదరి సెంటిమెంట్ తమ్ముడు మూవీకి ఎ సర్టిఫికెట్ కావాలన్న దిల్ రాజు

అప్పుడు బొమ్మరిల్లు ఇప్పుడు 3 BHK, అందుకే కె విశ్వనాథ్ గారికి అంకితం: సిద్ధార్థ్

ఆలయానికి మరో ఏనుగును విరాళంగా ఇచ్చిన నటి త్రిష

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments