Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆపరేషన్ సిందూర్ దాడులు : 80 మంది ఉగ్రవాదుల హతం

Advertiesment
deadbody

ఠాగూర్

, బుధవారం, 7 మే 2025 (08:50 IST)
పహల్గాం ఉగ్రదాడులకు ప్రతీకారంగా భారత్ దాడులకు దిగింది. పాకిస్థాన్‌తో పాటు పాక్ ఆక్రమిత
కాశ్మీర్‌లో ఈ దాడులు చేపట్టింది. భారత త్రివిధ దళాలు చేపట్టిన ఆపరేషన్ సిందూర్ దాడుల్లో 80 నుంచి వంది మంది వరకు ఉగ్రవాదులు ప్రాణాలు కోల్పోయినట్టు సమాచారం. ప్రధానంగా బవహల్పూర్(జైషే మహమ్మద్), మురిద్కే (లష్కరే తొయిబా) క్యాంపుల్లోనే అత్యధిక మంది ఉగ్రవాదులు చనిపోయినట్లు తెలుస్తోంది.
 
ఈ రెండు చోట్లా ఒక్కో క్యాంపులో 25-30 మంది మృతులు ఉన్నట్లు తెలుస్తోంది. వీటిల్లో మర్కజ్ తొయిబా మదర్సా అత్యంత కీలకమైంది. దీనిని లష్కరే తొయిబా ప్రధాన కార్యాలయంగా వినియోగిస్తుంటారు. ఇక బవహల్‌పూరులోని ఉస్మాన్ ఓ అలి క్యాంప్ జైషే ఉగ్రవాద సంస్థకు అత్యంత కీలకమైంది. ఇది 18 ఎకరాల్లో విస్తరించి ఉంది. 
 
వాస్తవానికి దీనిని 2019లోనే భారత్ లక్ష్యంగా చేసుకోవాలనుకుంది.. కానీ, నాడు చివర్లో వదిలేసింది. ఈసారి మాత్రం దానిని నేలమట్టం చేసింది. ఇప్పటివరకు తొమ్మిది స్థావరాల్లో 80 మంది వరకు మరణించినట్లు వార్తలొస్తున్నాయి. భారత ఇంటెలిజెన్స్ వర్గాలు పాక్కు జరిగిన నష్టాన్ని జాగ్రత్తగా అంచనా వేస్తోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మంగళవారం అర్థరాత్రి 1.44 గంటలకు ఆపరేషన్ సిందూర్ స్టార్ట్ (Video)