Webdunia - Bharat's app for daily news and videos

Install App

జార్ఖండ్ ముఖ్యమంత్రి ఇంట్లో కరోనా కలకలం - 15 మందికి పాజిటివ్

Webdunia
ఆదివారం, 9 జనవరి 2022 (11:21 IST)
జార్ఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ నివాసంలో కరోనా కలకలం చెలరేగింది. ఆయన భార్యాపిలలతో పాటు.. ఏకంగా 15 మందికి ఈ వైరస్ సోకింది. ప్రస్తుతం దేశంలో కరోనా థర్డ్ వేవ్ దెబ్బకు భారీగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గతంలో ఎన్నడూ లేనంతగా కరోనా వైరస్ వ్యాపిస్తుంది. 
 
ఈ పరిస్థితుల్లో జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులకు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో హేమంత్ సోరేన్‌ సతీమణిపాటు 15 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. అయితే, సీఎం హేమంత్‌కు మాత్రం నెగెటివ్ ఫలితం వచ్చిందని అధికారులు వెల్లడించారు. 
 
ముఖ్యమంత్రి నివాసంలో ఇప్పటివరకు 62 మందికి కోవిడ్ పరీక్షలు చేసినట్టు రాంచీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ వినోద్ కుమార్ వెల్లడించారు. వీరిలో 24 మందికి ఫలితాలు రాగా, అందులో 15 మందికి పాజిటివ్ ఫలితం వచ్చిందని తెలిపారు. 
 
ఇందులో సీఎం హేమంత్ భార్య కల్పనా సొరేన్, వారి ఇద్దరు కుమారులు నితిన్, విశ్వజిత్, కోడలు సరళా ముర్ములు ఉన్నారని తెలిపారు. ఈ నివాసంలో ఉన్నవారందరికీ తేలికపాటి కోవిడ్ లక్షణాలు ఉండటంతో సెల్ఫ్ హోం క్వారంటైన్‌లో ఉంచినట్టు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments