Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం హేమంత్‌ సోరెన్‌పై అత్యాచార ఆరోపణలు.. లైట్‌గా తీసుకున్న బీజేపీ ఎంపీ

Webdunia
శనివారం, 8 ఆగస్టు 2020 (13:32 IST)
జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌పై బీజేపీ ఎంపీ సోషల్ మీడియాలో ఆత్యాచార ఆరోపణలు చేశారు. 2013లో సోరెన్ ముంబైలో ఓ మహిళపై అత్యాచారం చేశారని ట్వీట్ చేశారు. ఈ నేపథ్యంలో హేమంత్ సోరెన్‌ బీజేపీ ఎంపీ నిషికాంత్‌ దూబేపై రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేశారు. 
 
సోషల్ మీడియాలో బీజేపీ ఎంపీ డాక్టర్ నిషికాంత్ దూబే తనపై తప్పుడు ఆరోపణలు చేశారని, రాంచీ సివిల్ కోర్టులో పరువునష్టం దావా దాఖలు చేశారు. ఇందులో బీజేపీ ఎంపీతో పాటు ట్విట్ట‌ర్ ఇండియా, ఫేస్ బుక్ ఇండియాల‌ను కూడా చేర్చారు. 
 
త‌న‌పై ఆరోప‌ణ‌లు చేసిన ఎంపీతో పాటు ఆ ఆరోప‌ణ‌ల‌ను నిర్ధారించుకోక‌ముందే త‌మ ఫ్లాట్ ఫామ్స్ నుండి తొల‌గించ‌లేద‌ని సీఎం పిటిష‌న్‌లో పేర్కొన్నారు. ఆగ‌స్టు 22న ఈ కేసులో పూర్తి స్థాయి వాద‌న‌లు కొన‌సాగ‌నున్నాయి. 
 
సీఎం ప‌రువున‌ష్టం దావాను బీజేపీ ఎంపీ లైట్‌గా తీసుకున్న‌ట్లు క‌న‌ప‌డుతోంది. ట్విట్ట‌ర్ వేదిక‌గా బీజేపీ ఎంపీ త‌న విమ‌ర్శ‌లు కొన‌సాగిస్తూనే ఉన్నారు. మీపై ముంబైలో ఓ యువ‌తి రేప్ కేసు పెట్టింది. మీరు ఆమెపై న్యాయ పోరాటం చేయాల‌ని… నా మీద కాకుండా త‌న‌పై కేసు పెట్టాలంటూ ఎంపీ కామెంట్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హరిహర వీరమల్లు దెబ్బకు యూట్యూబ్ షేక్... (వీడియో)

ప్ర‌భాస్ తో ఓ బాలీవుడ్ భామ‌ చేయనంటే.. మరో భామ గ్రీన్ సిగ్నల్ ?

UV క్రియేషన్స్ బ్రాండ్ కు చెడ్డపేరు తెస్తే సహించం

కల్ట్ క్లాసిక్‌లో చిరంజీవి, మహేష్ బాబు కలిసి అవకాశం పోయిందా !

రామాయణ: ది ఇంట్రడక్షన్ గ్లింప్స్‌ ప్రసాద్ మల్టీప్లెక్స్‌లోని PCX స్క్రీన్‌పై ప్రదర్శన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో చర్మం చక్కదనం

Monsoon: వర్షాకాలంలో నిద్ర ముంచుకొస్తుందా? ఇవి పాటిస్తే మంచిది..

తర్వాతి కథనం
Show comments