Webdunia - Bharat's app for daily news and videos

Install App

జెల్లీ ఫిష్‌ల దాడి.. బెంబేలెత్తిపోయిన పర్యాటకులు... 90 మంది గాయాలు..

Webdunia
శుక్రవారం, 20 నవంబరు 2020 (14:59 IST)
దేశంలోని ప్రముఖ సముద్ర పర్యాటక ప్రాంతాల్లో గోవా ఒకటి. ఈ రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలను తిలకించేందుకు దేశ విదేశాల నుంచి పర్యాటకులు వస్తుంటారు. అలా వచ్చిన పర్యాటకులపై గత రెండు రోజులుగా జెల్లీ ఫిష్‌లు గుంపులు గుంపులుగా చేరి దాడి చేస్తున్నాయి. దీంతో పర్యాటకులు బెంబేలెత్తిపోతున్నారు. ఈ జెల్లీ ఫిష్‌ల దాడుల్లో ఇప్పటివరకూ 90 మందికి‌పైగా గాయపడ్డారని గోవా బీచ్ లైఫ్ గార్డ్ ఏజన్సీ వెల్లడించింది.
 
బగా - కలంగూటే బీచ్‌లో దాదాపు 55 మంది, కండోలిమ్ - సింకెరిమ్ బీచ్‌లో 10 మంది, దక్షిణ గోవా బీచ్‌లో 25 మంది జెల్లీ చేపల బారిన పడ్డారని ఏజెన్సీ తెలిపింది. గుంపులుగా వస్తున్న ఇవి, సముద్రంలోకి వెళ్లే పర్యాటకులపై దాడులు చేస్తున్నాయని వెల్లడించింది. 
 
గాయపడిన పర్యాటకులకు ఎప్పటికప్పుడు ప్రాథమిక చికిత్స అందించామని తెలిపింది. అదేసమయంలో ఈ చేపలు ఎక్కువగా సంచరించే బీచ్ ప్రాంతంలో హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశామని గోవా పర్యాటక శాఖ అధికారులు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

దీక్షిత్ శెట్టి క్రైమ్ కామెడీ థ్రిల్లర్ టైటిల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి

మల్లె మొగ్గ సక్సెస్ స్ఫూర్తితో యాక్షన్ ఎంటర్ టైనర్ గా వస్తోన్న తథాస్తు చిత్రం

రేవ్ పార్టీలు - ప‌బ్‌ల‌కు వెళ్లే వ్య‌క్తిని నేను కాదు.. త‌ప్పుడు క‌థ‌నాల‌ను న‌మ్మ‌కండి : న‌టుడు శ్రీకాంత్

బెంగుళూరు రేవ్ పార్టీ ఫామ్ హౌస్‌లోనే ఉన్న హేమ?? పట్టించిన దుస్తులు!

ముంబై స్టార్ స్పోర్ట్స్‌లో భార‌తీయుడు 2 ప్రమోషన్స్ షురూ

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

తర్వాతి కథనం
Show comments