Webdunia - Bharat's app for daily news and videos

Install App

జయలలిత శరీరంలోకి ఐదున్నర లీటర్ల రసాయనాలు...

తమిళనాడు ముఖ్యమంత్రి దివంగత జయలలిత మృతి ఓ మిస్టరీ. ఈ మిస్టరీని ఛేదించేందుకు జస్టీస్ ఆర్ముగస్వామి నేతృత్వంలో నిజ నిర్ధారణ కమిటీని ప్రభుత్వం ఏర్పాటుచేసింది. ఈ కమిటీ విచారణలో అనేక విషయాలు ఒక్కొక్కటిగా వె

Webdunia
గురువారం, 4 జనవరి 2018 (09:41 IST)
తమిళనాడు ముఖ్యమంత్రి దివంగత జయలలిత మృతి ఓ మిస్టరీ. ఈ మిస్టరీని ఛేదించేందుకు జస్టీస్ ఆర్ముగస్వామి నేతృత్వంలో నిజ నిర్ధారణ కమిటీని ప్రభుత్వం ఏర్పాటుచేసింది. ఈ కమిటీ విచారణలో అనేక విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.
 
తాజాగా జయలలిత శరీరంలోకి ఐదున్నర లీటర్ల రసాయనాలను ఎక్కించినట్టు మద్రాస్ మెడికల్ కాలేజీ (ఎంఎంసీ) అనాటమీ విభాగం చీఫ్ డాక్టర్ సుధా శేషయ్యన్ వెల్లడించారు. ఈ రసాయనాలను ఎంబ్లామింగ్‌ చికిత్స కోసం ఎక్కించామని తెలిపారు. రసాయనాలను శరీరంలోకి ఎక్కించేందుకు జయలలిత ఎడమ దవడపై రంధ్రాలు చేసినట్టు ఆమె విచారణ కమిటీకి తెలిపారు. జయలలితకు ఉన్న అత్యంత సన్నిహితురాళ్ళలో సుధా శేషయ్యన్ ఒకరు. 
 
ఈమె విచారణ కమిటీకి ఇచ్చిన వాంగ్మూలంలోని విషయాలను పరిశీలిస్తే, "అమ్మ మరణించిన రోజు రాత్రి 10 గంటలకు ఆసుపత్రి నుంచి ఫోన్ వచ్చింది. ప్రజలు సందర్శించే వరకు మృతదేహం చెడిపోకుండా, దుర్వాసన రాకుండా ఎంబ్లామింగ్ చేయడానికి తనను రమ్మన్నారు. తన వైద్య బృందంతో ఆసుపత్రికి చేరుకుని మృతదేహంలోకి రసాయనాలు ఎక్కించేందుకు జయ ఎడమ దవడపై నాలుగు రంధ్రాలు చేసినట్టు వివరించారు. 
 
ఈ రంధ్రాల ద్వారా మిథనాల్ సహా వివిధ రసాయనాలు కలిగిన ఐదున్నర లీటర్ల మిశ్రమాన్ని జయ శరీరంలోకి ఇంజెక్షన్ల ద్వారా ఎక్కించినట్టు తెలిపారు. తీవ్ర అస్వస్థతకు గురైన జయలలిత చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేరారు. 75 రోజుల చికిత్స తర్వాత డిసెంబరు 5, 2016న తుదిశ్వాస విడిచిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలీవుడ్ డైరెక్టర్‌తో ప్రేమలో వున్న సమంత? చేతులు పట్టుకుని సంథింగ్ సంథింగ్

'సంక్రాంతికి వస్తున్నాం' వసూళ్ల సునామీ - ఇండస్ట్రీ ఆల్‌టైమ్ రికార్డు

హాస్య మూవీస్ బ్యానర్‌‌పై హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ ప్రారంభం

గోవాలో ఆత్మహత్యకు పాల్పడిన టాలీవుడ్ నిర్మాత!

విష్ణు మంచు కన్నప్ప నుంచి ప్రళయ కాల రుద్రుడిగా ప్రభాస్ లుక్ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కేన్సర్ జీనోమ్ డేటాబేస్‌ను ప్రారంభించిన ఐఐటీ-మద్రాస్

అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ తొలి పీడియాట్రిక్ బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్‌

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం: క్యాన్సర్ ఛాంపియన్‌ల కోసం హెచ్‌సిజి క్యూరీ క్యాన్సర్ సెంటర్ పికిల్‌బాల్ టోర్నమెంట్‌

టీకన్సల్ట్ ద్వారా సమగ్ర ఆరోగ్య సంరక్షణ: మంతెన సత్యనారాయణ రాజు ఆరోగ్య ప్రసంగం

స్ట్రాబెర్రీలు తింటే 7 ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments