Webdunia - Bharat's app for daily news and videos

Install App

తాజ్‌మహాల్ నిర్మించిన స్థలం మాది అంటున్న బీజేపీ ఎంపీ దియాకుమారి

Webdunia
గురువారం, 12 మే 2022 (14:25 IST)
ప్రేమసౌథం తాజ్‌ మహాల్ నిర్మించిన స్థలం తమ కుటుంబానికి చెందినదని భారతీయ జనతా పార్టీకి చెందిన ఎంపీ దియాకుమారి మీర్జా అంటున్నారు. తమదైన ఈ స్థలాన్ని అప్పట్లో షాజహాన్ స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. స్థలం స్వాధీనం చేసుకున్నప్పటికీ అప్పట్లో ఇచ్చిన పరిహారం అంతంతమాత్రమేనని అన్నారు. దీనిపై నాడు పోరాడేందుకు కోర్టులు లేవన్నారు. అదేసమయంలో తాజ్‌మహాల్ సమాధుల కింద ఏముందో తేలాలని ఈ జైపూర్ మాజీ యువరాణి అంటున్నారు. 
 
తాజ్‌మహాల్ కింద ఉన్న 22 గదులను తెరిచి, అందులో హిందూ దేవతామూర్తుల విగ్రహాలు ఉన్నాయేమో తేల్చాలని కోరుతూ అలహాదాబాద్ హైకోర్టు లక్నో బెంచ్‌లో ఓ పిటిషన్ దాఖలైంది. ఈ క్రమంలో దియా కుమారి మీర్జా స్పందించారు. తాజ్ మహాల్ నిర్మించిన స్థలం తమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
 
"భూమికి సంబంధించి పరిహారం ఇచ్చారు. కానీ, ఎంత మొత్తం? దీన్ని ఆమోదించిందీ లేనిదీ నేను చెప్పలేను. ఆ రికార్డులను నేను చదవలేదు. కానీ, ఆ భూమి మాత్రం మాదే. షాజహాన్ స్వాధీనం చేసుకున్నాడు. ఆ కాలంలో ఏ న్యాయస్థానాలు లేవు. అప్పీల్ చేసే అవకాశం కూడా లేదు. అందుకే రికార్డులు అధ్యయనం చేయాలి. అపుడే వాస్తవాలు వెలుగులోకి వస్తాయి" అని ఆమె చెప్పుకొచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

జేమ్స్ కామెరూన్ అవతార్: ఫైర్ అండ్ యాష్ తెలుగు ట్రైలర్ ఇప్పుడు విడుదల

90 సెకన్ల డెడ్ హ్యాంగ్ ఛాలెంజ్‌ను స్వీకరించిన సమంత రూతు ప్రభు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments