కక్ష్యకు అత్యంత సమీపానికి చేరుకున్న స్పేడెక్స్ ఉపగ్రహాలు : ఇస్రో

ఠాగూర్
ఆదివారం, 12 జనవరి 2025 (14:47 IST)
నింగిలో డాకింగ్ ప్రక్రియను విజయవంతంగా నిర్వహించేందుకు ప్రయోగించిన స్పాడెక్స్ ఉపగ్రహాలు అత్యంత సమీపానికి చేరుకున్నాయని ఇస్రో ప్రకటించింది. ఈ మేరకు ఎక్స్ పోస్టు పెట్టింది. తాజాగా వీటిని 15 మీటర్ల సమీపానికి తీసుకొచ్చి.. ఆపై 3 మీటర్లకు ఈ దూరాన్ని తగ్గించింది. ఈ ప్రక్రియ ముగిసిన అనంతరం తిరిగి రెండు ఉపగ్రహాలను సురక్షితమైన దూరానికి జరిపినట్లు పేర్కొంది. ఈ డేటాను విశ్లేషించిన తర్వాత డాకింగ్ ప్రక్రియ చేపడతామని ఇస్రో ప్రకటించింది. 
 
అంతకుముందు స్పాడెక్స్ ఉపగ్రహాల చిత్రాలను కూడా ఎక్స్ పోస్టు చేసింది. ఆదివారం తెల్లవారు జామున 3.10 సమయంలో తొలుత ఈ ఉపగ్రహాలను 105 మీటర్ల దగ్గరికి చేర్చారు. అనంతరం అవి చేతులు కలపడానికి సిద్ధంగా ఉన్నాయని ఇస్రో తెలిపింది. నింగిలో డాకింగ్ కోసం జంట స్పాడెక్స్ ఉపగ్రహాలను ఇస్రో ప్రయోగించింది. అవి 'హోల్డ్' దశలో ఉన్నాయి. 
 
ఎసీఎక్స్01 (ఛేజర్), ఎసీఎక్స్ 02 (టార్గెట్) అనే ఈ రెండు ఉపగ్రహాలను గత నెల 30న పీఎస్ఎల్వీ రాకెట్ ద్వారా 475 కిలోమీటర్ల వృత్తాకార కక్ష్యలోకి ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ నెల 7, 9 తేదీల్లో వీటిని అనుసంధానం (డాకింగ్) చేసేందుకు నిర్ణయించినప్పటికీ.. వివిధ కారణాల వల్ల అది వాయిదాపడింది. ఆ ప్రక్రియ ఇప్పుడు జోరుగా జరుగుతోంది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nandamuri Kalyan: ఛాంపియన్ తో 35 ఏళ్ల తర్వాత నందమూరి కళ్యాణ్ చక్రవర్తి రీఎంట్రీ

మంత్రి సీతక్క లాంచ్ చేసిన కామాఖ్య ఇంటెన్స్ థ్రిల్లింగ్ ఫస్ట్ లుక్

ఘంటసాల ది గ్రేట్ మూవీ మరో శంకరాభరణం అవుతుందన్న ప్రముఖులు

నేను నమ్మితే షూటింగ్ కు కూడా ఎప్పుడో గానీ వెళ్లను : నిర్మాత కేఎల్ దామోదర ప్రసాద్

Akhil Akkineni : ప్రశాంత్ నీల్ తో అఖిల్ అక్కినేని చిత్రం ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

తర్వాతి కథనం
Show comments