కక్ష్యకు అత్యంత సమీపానికి చేరుకున్న స్పేడెక్స్ ఉపగ్రహాలు : ఇస్రో

ఠాగూర్
ఆదివారం, 12 జనవరి 2025 (14:47 IST)
నింగిలో డాకింగ్ ప్రక్రియను విజయవంతంగా నిర్వహించేందుకు ప్రయోగించిన స్పాడెక్స్ ఉపగ్రహాలు అత్యంత సమీపానికి చేరుకున్నాయని ఇస్రో ప్రకటించింది. ఈ మేరకు ఎక్స్ పోస్టు పెట్టింది. తాజాగా వీటిని 15 మీటర్ల సమీపానికి తీసుకొచ్చి.. ఆపై 3 మీటర్లకు ఈ దూరాన్ని తగ్గించింది. ఈ ప్రక్రియ ముగిసిన అనంతరం తిరిగి రెండు ఉపగ్రహాలను సురక్షితమైన దూరానికి జరిపినట్లు పేర్కొంది. ఈ డేటాను విశ్లేషించిన తర్వాత డాకింగ్ ప్రక్రియ చేపడతామని ఇస్రో ప్రకటించింది. 
 
అంతకుముందు స్పాడెక్స్ ఉపగ్రహాల చిత్రాలను కూడా ఎక్స్ పోస్టు చేసింది. ఆదివారం తెల్లవారు జామున 3.10 సమయంలో తొలుత ఈ ఉపగ్రహాలను 105 మీటర్ల దగ్గరికి చేర్చారు. అనంతరం అవి చేతులు కలపడానికి సిద్ధంగా ఉన్నాయని ఇస్రో తెలిపింది. నింగిలో డాకింగ్ కోసం జంట స్పాడెక్స్ ఉపగ్రహాలను ఇస్రో ప్రయోగించింది. అవి 'హోల్డ్' దశలో ఉన్నాయి. 
 
ఎసీఎక్స్01 (ఛేజర్), ఎసీఎక్స్ 02 (టార్గెట్) అనే ఈ రెండు ఉపగ్రహాలను గత నెల 30న పీఎస్ఎల్వీ రాకెట్ ద్వారా 475 కిలోమీటర్ల వృత్తాకార కక్ష్యలోకి ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ నెల 7, 9 తేదీల్లో వీటిని అనుసంధానం (డాకింగ్) చేసేందుకు నిర్ణయించినప్పటికీ.. వివిధ కారణాల వల్ల అది వాయిదాపడింది. ఆ ప్రక్రియ ఇప్పుడు జోరుగా జరుగుతోంది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గురుదత్త గనిగ, రాజ్ బి. శెట్టి కాంబోలో జుగారి క్రాస్ టైటిల్ ప్రోమో

Shimbu: సామ్రాజ్యం తో శింబు బెస్ట్ గా తెరపైన ఎదగాలి : ఎన్టీఆర్

Ram Charan: పెద్ది తాజా అప్ డేట్.. శ్రీలంక వెళ్లనున్న రామ్‌చరణ్‌

Shivaji : శివాజీ, లయ కాంబినేషన్ లో పంచాయతీ సెక్రెటరీ

Siddu: తెలుసు కదా.. చేసే ముందు భయం ఉండేది, ఈరోజు భయం పోయింది : సిద్ధు జొన్నలగడ్డ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments