Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌లో ఇంటర్నెట్ కొత్తకాదు.. మహాభారతం కాలం నుంచే ఉంది : త్రిపుర సీఎం

భారత్‌లో ఇంటర్నెట్ కొత్తకాదనీ, మహాభారత కాలం నుంచే ఉందని త్రిపుర రాష్ట్ర ముఖ్యమంత్రి బిప్లవ్ కుమార్ దెబ్ చెప్పుకొచ్చారు. అగర్తలలో 'కంప్యూటరైజేషన్, సంస్కరణ'లపై జరిగిన ఓ సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించార

Webdunia
బుధవారం, 18 ఏప్రియల్ 2018 (14:42 IST)
భారత్‌లో ఇంటర్నెట్ కొత్తకాదనీ, మహాభారత కాలం నుంచే ఉందని త్రిపుర రాష్ట్ర ముఖ్యమంత్రి బిప్లవ్ కుమార్ దెబ్ చెప్పుకొచ్చారు. అగర్తలలో 'కంప్యూటరైజేషన్, సంస్కరణ'లపై జరిగిన ఓ సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు. 
 
భారత్‌లో మహాభారత్ కాలం నుంచే ఇంటర్నెట్, శాటిలైట్ మనుగడలో ఉన్నాయని, కొత్తేమి కాదన్నారు. లక్షల సంవత్సరాల క్రితమే భారత్ ఇంటర్నెట్‌ను కనుగొన్నదన్నారు. మహాభారత కాలం నుంచే భారత్‌లో ఇంటర్నెట్, శాటిలైట్ సేవలు అందుబాటులో ఉన్నాయని చెప్పుకొచ్చిన ఆయన.. ఈ సందర్భంగా కురుక్షేత్రంలోని ఓ సంఘటనను కూడా ఉదహరించారు కూడా.
 
ధృతరాష్ట్రుడి రథసారధి సంజయుడు. చూపులేని ధృతరాష్ట్రుడికి కురుక్షేత్ర యుద్ధం గురించి సవిరంగా సంజయ ఎలా చెప్పగలిగాడు.. అంటే సాంకేతిక పరిజ్ఞానం అప్పటికే భారత్‌లో అందుబాటులో ఉందని అర్థమన్నారు. వాటి సహాయం ద్వారానే సంజయ యుద్ధం గురించి చెప్పాడన్నారు. యూనైటెడ్ స్టేట్స్, యూరోపియన్ యూనియన్‌‌లు తమ ఆవిష్కరణలుగా చెప్పుకుంటున్నప్పటికీ.. వాస్తవానికి అది భారతీయ సాంకేతికతన్నారు. గొప్పస్కృతిక చరిత్ర జాతి సొంతమన్నారు. దానిపట్ల తానెంతో గర్వంగా ఫీలవుతున్నట్టు చెప్పారు.
 
ఇప్పటికే సాంకేతిక రంగంలో మనమే ముందున్నామని గుర్తు చేశారు. మైక్రోసాఫ్ట్ సంస్థ యూఎస్ సంస్థే కావచ్చు. అయితే అందులో పనిచేసే ఇంజినీర్లు అత్యధికులు మన దేశానికి చెందినవారేనన్నారు. మహాభారత కాలం నుంచి టెక్నాలజీలో భారత్ ముందున్నదని.. మధ్యలో అది కనుమరుగైందన్నారు. తిరిగి ప్రస్తుతం మళ్లీ టెక్నాలజీలో దూసుకెళ్తుందన్నారు. ప్రపంచానికి అత్యధిక ఇంజినీర్లను అందించడమే ఇందుకు నిదర్శనమని ఈ బీజేపీ ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thug Life: కమల్ హాసన్‌ను క్షమాపణ చెప్పమని కోరడం తగదు: సుప్రీం కోర్టు

Dil Raju: గద్దర్ అవార్డ్ ఫంక్షన్ హిట్టా - ఫ్లాపా - ఏవరేజా? స్పెషల్ స్టోరీ

Raja sab: గత ఏడాది మా చిత్రాలు నిరాశపరిచాయి : టీజీ విశ్వప్రసాద్

Bengal Files: రాజకీయ వ్యవస్థను ప్రశ్నించిన ది బెంగాల్ ఫైల్స్ టీజర్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments