Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సోషల్ మీడియాలో ఇలాంటి ఫోటోలు పెట్టొద్దు.. కుళ్లుకునేవాళ్లున్నారు..?

సోషల్ మీడియాలో సెలెబ్రిటీలు తమ హాట్ ఫోటోలు, స్టేటస్ తెలియజేసే ఫోటోలు పెట్టడం ప్రస్తుతం ఫ్యాషనైపోయింది. ఇదే తరహాలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ సుందరి అనుష్క శర్మల ఫోటోలు వైరల్ అవుతున్నాయ

Advertiesment
Anushka Sharma
, సోమవారం, 12 మార్చి 2018 (11:01 IST)
సోషల్ మీడియాలో సెలెబ్రిటీలు తమ హాట్ ఫోటోలు, స్టేటస్ తెలియజేసే ఫోటోలు పెట్టడం ప్రస్తుతం ఫ్యాషనైపోయింది. ఇదే తరహాలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ సుందరి అనుష్క శర్మల ఫోటోలు వైరల్ అవుతున్నాయి. వివాహానికి ముందు, పెళ్లి ఫోటోలు, పెళ్లికి తర్వాత హాలీడే ట్రిప్పులకు సంబంధించిన ఫోటోలను ఈ యువ జంట ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేస్తున్నాయి.
 
అయితే ఈ ఫోటోలు వైరల్ అవుతున్న కారణంగా విరుష్క జోడీకి ఫ్యాన్స్ ఓ సూచన చేశారు. ఇలాంటి అందమైన ఫోటోలను ఎక్కువగా సోషల్ మీడియాలో పోస్ట్ చేయకండి.. ఆ ఫోటోలను చూసి కుళ్ళుకునే వాళ్లుంటారని చెప్పారట. అందరి కళ్లూ ఒకేలా వుండవని.. విరుష్కలకు సూచించినట్లు తెలుస్తోంది. 
 
కాగా.. తాజాగా క్రికెట్ టూర్లు, షూటింగ్‌లతో నిత్యం బిజీగా ఉండే వీరిద్దరూ, హాలీడేని ఇంట్లో ఎంజాయ్ చేస్తున్నారు. శ్రీలంక టూర్‌కు విశ్రాంతి తీసుకుని కోహ్లీ ఇంట్లో ఉండగా, సినిమా షూటింగ్ విరామంతో అనుష్క ఇంటికి చేరింది. 
 
ఈ సందర్భంగా ముంబైలోని ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. తాజాగా అనుష్క కొహ్లీని ముద్దాడుతున్న ఫోటోను ఇన్‌ స్టాగ్రామ్‌‌లో పోస్ట్‌ చేసింది. ఈ ఫోటో పెట్టిన క్షణాల్లో వైరల్‌గా మారింది. ఇలాంటి ఫోటోలు ఇక పెట్టవద్దని కోహ్లీ జంటకు ఫ్యాన్స్ సూచించినట్లు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చర్చలకు సై.. పాప కోసం మేమిద్దరం కలిసి వుండటమే మంచిది: షమీ