తూర్పు నౌకాదళ కేంద్రం : ఐఎన్ఎస్ నిర్దేశక్ నౌక ప్రత్యేకతలేంటి?

ఠాగూర్
బుధవారం, 18 డిశెంబరు 2024 (10:33 IST)
హిందూ మహాసముద్రంలో చైనా నుంచి ఎదురవుతున్న సవాళ్లు వ్యూహాత్మకంగా వ్యవహరించేందుకు ఐఎన్ఎస్ నిర్దేశక్ పేరు రక్షణ నౌకను భారత రక్షణ శాఖ తయారు చేసింది. ఈ నౌకను కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ జాతికి అంకితం చేయనున్నారు. బుధవారం విశాఖ నౌకాదళంలో జరిగే కార్యక్రమంలో ఆయన పాల్గొని ఐఎన్ఎస్ నిర్దేశక్ నౌకను జాతికి అంకితం చేయనున్నారు.
 
ఐఎన్ఎస్ నిర్దేశక్ నౌక‌ను కోల్‌కతాలోని గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ (జీఆర్ఎస్ఈ) కంపెనీ నిర్మించింది. ఈ నౌక పొడవు 110 మీటర్లు... దీని బరువు 3,800 టన్నులు. దీంట్లో 2 ఇంజన్లు ఉంటాయి. అత్యాధునిక హైడ్రోగ్రాఫిక్, ఓషనోగ్రాఫిక్ సర్వే పరికరాలతో ఈ నౌకకు రూపకల్పన చేశారు. వీడ్కోలు తీసుకున్న నిర్దేశక్ నౌక స్థానంలో ఈ కొత్త ఐఎన్ఎస్ నిర్దేశక్ నౌకను తయారు చేశారు. 
 
18 నాటికల్ మైళ్ల వేగంతో ఏకబిగిన 25 రోజుల పాటు ప్రయాణించడం ఈ నౌక ప్రత్యేకత. హిందూ మహాసముద్రంలో చైనా నుంచి ఎదురవుతున్న వ్యూహాత్మక సవాళ్లను ఎదుర్కోవడంలో ఐఎన్ఎస్ నిర్దేశక్ కీలకపాత్ర పోషించనుందని రక్షణ రంగ వర్గాలు భావిస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మగవాళ్లకు కూడా జీవితంలో ఒక్కసారైనా పీరియడ్స్ రావాలి... రష్మిక మందన్నా

పెళ్లికి కూడా ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది... కాజోల్

తోట తరణి సృజనాత్మక యువరతరానికి ఆదర్శం : పవన్ కళ్యాణ్

ప్రభాస్ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి? క్లారిటీ ఇచ్చిన దర్శకుడు

Vijay Kisses Rashimika: రష్మిక మందన్న తో తమ సంబంధాన్ని ప్రకటించిన విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

స్ట్రోక్ తర్వాత వేగంగా కోలుకోవడానికి రోబోటిక్ రిహాబిలిటేషన్ కీలకమంటున్న నిపుణులు

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ సిద్ధం చేసింది ఫ్యాషన్ ముందడుగు

తర్వాతి కథనం
Show comments