Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్వారంటైన్‌లోని మహిళపై గ్యాంగ్ రేప్.. ఎక్కడ?

Webdunia
మంగళవారం, 28 ఏప్రియల్ 2020 (15:16 IST)
లాక్‌డౌన్ సమయంలోనూ కామాంధులు రెచ్చిపోతున్నారు. సొంతూర్లకు వెళ్లేందుకు బస్సులు లేక క్వారంటైన్‌లో ఉన్న మహిళను సైతం కామాంధులు వదిలిపెట్టలేదు. దీనికి నిదర్శనమే క్వారంటైన్‌లో ఓ మహిళపై సామూహిక అత్యాచారం జరిగింది. ఇది రాజస్థాన్ రాష్ట్రంలోని సవాయి మాధోపూర్ బటోడా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, జైపూర్‌కు చెందిన ఓ మహిళ లాక్‌డౌన్ కారణంగా అక్కడే ఉండాల్సి వచ్చింది. రోజులు గడుస్తున్నా లాక్‌డౌన్‌ను ఎత్తేయకపోవడంతో... కాలినడకన ఆమె సొంతూరుకు బయల్దేరింది.
 
అయితే, గురువారం రాత్రికి ఆమె మాధోపూ‌ర్‌కు చేరుకోగా... స్థానికులు ఆమెను అడ్డుకున్నారు. బటోడా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఓ పాఠశాలలో ఏర్పాటు చేసిన క్వారంటైన్‌కు తరలించారు. దీన్ని అదనుగా తీసుకున్న ముగ్గురు వ్యక్తులు అర్థరాత్రి సమయంలో పాఠశాలకు చేరుకుని ఆమెపై సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. 
 
బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు... ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. వీరిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఈ ఘటనపై స్థానిక మహిళా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఆ కామాంధులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం