Webdunia - Bharat's app for daily news and videos

Install App

77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు- పంజాబ్‌లో ఉగ్రమూకల అరెస్ట్

Webdunia
సోమవారం, 14 ఆగస్టు 2023 (21:48 IST)
Punjab
దేశవ్యాప్తంగా 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు మంగళవారం ఘనంగా జరిగేందుకు అన్నీ ఏర్పాట్లు పూర్తయ్యాయి. అయితే స్వాతంత్ర్య దినోత్సవం రోజున ఉగ్రవాద దాడులు, విధ్వంసాలను నివారించడానికి అన్ని రాష్ట్రాల పోలీసులు,  సైన్యం తీవ్రంగా కృషి చేస్తున్నారు. 
 
దేశ సరిహద్దుల్లో భద్రతా ఏర్పాట్లను పటిష్టం చేశారు. ఆ విధంగా పంజాబ్ రాష్ట్రానికి చెందిన ఐదు మందిని ఆ రాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిని పంజాబ్ పోలీసులు సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీతో కలిసి ఈ అరెస్టు చేశారు. ఈ ఐదుగురు వ్యక్తులు పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాదులు హర్విందర్ రిండా, అమెరికాకు చెందిన గోల్డీ బ్రార్‌ల కార్యకర్తలు అని తేలింది.
 
వీరు రాష్ట్రవ్యాప్తంగా లక్ష్యంగా విధ్వంసం చేసేందుకు పక్కా ప్లాన్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇంకా వారి నుంచి రెండు విదేశీ పిస్టల్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు పంజాబ్‌ పోలీస్‌ డైరెక్టర్‌ జనరల్‌ గౌరవ్‌ యాదవ్‌ తెలిపారు. వారిపై చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు. అలాగే సోమవారం పంజాబ్‌లోని డార్న్ దారన్ ప్రాంతంలో ఉగ్రవాద ఆరోపణలపై ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేయడం గమనార్హం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments