Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌పై విశ్వాసం కోల్పోయిన కాశ్మీరీలు.. యశ్వంత్ సిన్హా

కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి, బీజేపీ సీనియర్ నేత యశ్వంత్ సిన్హా మరోమారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సర్కారును లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. నిన్నటికినిన్న ప్రధాని మోడీ పాలనలో ఆర్థిక వ్యవస్థ పతనా

Webdunia
సోమవారం, 2 అక్టోబరు 2017 (10:43 IST)
కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి, బీజేపీ సీనియర్ నేత యశ్వంత్ సిన్హా మరోమారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సర్కారును లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. నిన్నటికినిన్న ప్రధాని మోడీ పాలనలో ఆర్థిక వ్యవస్థ పతనావస్థలో ఉందంటూ సంచలన విమర్శలు చేశారు. 
 
ఇపుడు జమ్మూకాశ్మీరు సంక్షోభంపై కేంద్రం తీరును తప్పుబట్టారు. భావోద్వేగపరంగా కాశ్మీరీలను భారత్‌ కోల్పోయిందన్నారు. వారు భారత్‌పై విశ్వాసం కోల్పోయారని అభిప్రాయపడ్డారు. ప్రముఖ జర్నలిస్టు కరణ్‌ థాపర్‌ ‘ది వైర్‌’ చానల్‌ కోసం యశ్వంత్‌తో ముఖాముఖి మాట్లాడారు.
 
కన్సర్న్‌డ్‌ సిటిజెన్స్‌ గ్రూప్‌ (సీసీజీ)నకు యశ్వంత్ సిన్హా నేతృత్వం వహిస్తున్నారు. ఈ గ్రూపు కొంతకాలం కింద కాశ్మీరు వెళ్లి వివిధ వర్గాల ప్రజలు, వేర్పాటువాదులతో చర్చించింది. అపుడు ఎదురైన అనుభవాలను ఆయన ఇపుడు బహిర్గతం చేశారు. 
 
‘కాశ్మీరీలు భారత్‌కు దూరం కావడం నాకు ఆందోళన కలుగజేస్తోంది. మనం అక్కడకు వెళ్లి చూస్తే మనపై వారికి విశ్వాసం పోయిందని తెలుస్తుంది. దీనిపై చర్చించేందుకు ప్రధానిని అపాయింట్‌మెంట్‌ కోరాను. పదినెలలు గడిచినా ఆయన ఇంతవరకు స్పందించలేదు’ అని వాపోయారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments