Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహాత్ముడి ఆలోచనలు స్ఫూర్తిమంత్రం : ప్రధాని మోడీ

జాతిపిత మహాత్మాగాంధీ 148వ జయంతి సందర్భంగా సోమవారం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాజ్‌ఘాట్‌లో నివాళులర్పించారు. అలాగే, భారత రెండో ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రికి వ

Webdunia
సోమవారం, 2 అక్టోబరు 2017 (10:21 IST)
జాతిపిత మహాత్మాగాంధీ 148వ జయంతి సందర్భంగా సోమవారం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాజ్‌ఘాట్‌లో నివాళులర్పించారు. అలాగే, భారత రెండో ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రికి విజయ్‌ఘాట్‌లో పుష్పాంజలి ఘటించారు.
 
ప్రధాని, రాష్ట్రపతిలతో పాటు ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, బీజేపీ సీనియర్ నేత ఎల్‌కే అడ్వాణీ తదితరులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గాంధీ జయంతి, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకల సందర్భంగా వారిని స్మరించుకుంటూ ప్రధాని మోడీ ట్విటర్లో పోస్టు చేశారు. మహాత్ముడి ఆలోచనలు ప్రపంచంలోని కోట్లాదిమందికి స్ఫూర్తిమంత్రమన్నారు. 
 
ఇకపోతే, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, చంద్రశేఖర్ రావులు బాపూజీకి నివాళులు అర్పించారు. అలాగే, ఏపీ విపక్ష నేత వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. మహాత్మాగాంధీ జీవితం స్ఫూర్తిదాయకమని, ప్రతి ఒక్కరిలోనూ ఆ స్ఫూర్తి నిండాలని వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు. మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా ఆయనను స్మరించుకుందామంటూ ట్వీట్‌ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments