Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహాత్ముడి ఆలోచనలు స్ఫూర్తిమంత్రం : ప్రధాని మోడీ

జాతిపిత మహాత్మాగాంధీ 148వ జయంతి సందర్భంగా సోమవారం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాజ్‌ఘాట్‌లో నివాళులర్పించారు. అలాగే, భారత రెండో ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రికి వ

Webdunia
సోమవారం, 2 అక్టోబరు 2017 (10:21 IST)
జాతిపిత మహాత్మాగాంధీ 148వ జయంతి సందర్భంగా సోమవారం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాజ్‌ఘాట్‌లో నివాళులర్పించారు. అలాగే, భారత రెండో ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రికి విజయ్‌ఘాట్‌లో పుష్పాంజలి ఘటించారు.
 
ప్రధాని, రాష్ట్రపతిలతో పాటు ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, బీజేపీ సీనియర్ నేత ఎల్‌కే అడ్వాణీ తదితరులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గాంధీ జయంతి, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకల సందర్భంగా వారిని స్మరించుకుంటూ ప్రధాని మోడీ ట్విటర్లో పోస్టు చేశారు. మహాత్ముడి ఆలోచనలు ప్రపంచంలోని కోట్లాదిమందికి స్ఫూర్తిమంత్రమన్నారు. 
 
ఇకపోతే, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, చంద్రశేఖర్ రావులు బాపూజీకి నివాళులు అర్పించారు. అలాగే, ఏపీ విపక్ష నేత వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. మహాత్మాగాంధీ జీవితం స్ఫూర్తిదాయకమని, ప్రతి ఒక్కరిలోనూ ఆ స్ఫూర్తి నిండాలని వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు. మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా ఆయనను స్మరించుకుందామంటూ ట్వీట్‌ చేశారు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments