Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పవన్ కళ్యాణ్‌ను పట్టించుకోని ప్రధాని మోదీ... కటీఫ్....?

దేశంలోని 'స్వచ్చ్ భారత్'లో భాగంగా స్వచ్చతే సేవాను సెప్టెంబరు 15 నుంచి అక్టోబరు 2 వరకూ జరుగుతోంది. ఇందులో భాగంగా ఆయన వివిధ వర్గాలకు చెందిన ప్రముఖలకు ప్రధానమంత్రి స్వయంగా లేఖలు రాస్తున్నారు. తాజాగా తెలుగు సినీ ఇండస్ట్రీకి చెందిన రాజమౌళి, మోహన్ బాబు, ప్

Advertiesment
పవన్ కళ్యాణ్‌ను పట్టించుకోని ప్రధాని మోదీ... కటీఫ్....?
, సోమవారం, 18 సెప్టెంబరు 2017 (17:13 IST)
దేశంలోని 'స్వచ్చ్ భారత్'లో భాగంగా స్వచ్చతే సేవాను సెప్టెంబరు 15 నుంచి అక్టోబరు 2 వరకూ జరుగుతోంది. ఇందులో భాగంగా ఆయన వివిధ వర్గాలకు చెందిన ప్రముఖలకు ప్రధానమంత్రి స్వయంగా లేఖలు రాస్తున్నారు. తాజాగా తెలుగు సినీ ఇండస్ట్రీకి చెందిన రాజమౌళి, మోహన్ బాబు, ప్రభాస్, మహేష్ బాబులకు స్వయంగా ప్రధాని లేఖలు రాసి స్వచ్చతే సేవా కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. ఐతే ఈ జాబితాలో పవన్ కళ్యాణ్ పేరు లేకపోవడం పెద్ద చర్చనీయాంశంగా మారింది. 
 
ప్రధానమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు లేఖ రాయపోవడంతో ఇక భాజపా-జనసేన మైత్రి బంధం కటీఫ్ అని అనుకుంటున్నారు. మరోవైపు తెలంగాణ రాష్ట్ర ఐటీ, మున్సిప‌ల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ను ప్ర‌శంసిస్తూ ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ లేఖ రాసిన సంగతి తెలిసిందే. మిష‌న్ భ‌గీర‌థ‌తో పాటు స్వ‌చ్ఛ భార‌త్ కార్య‌క్ర‌మాల‌ను తెలంగాణ రాష్ట్రం నిర్వ‌హిస్తున్న తీరును ప్ర‌శంసిస్తూ కేటీఆర్‌కు ప్ర‌ధాని లేఖ పంపారు. ఆ లేఖను మంత్రి కేటీఆర్ ట్విట్టర్లో వుంచారు. 
 
ఇలా తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖులకు లేఖలు పంపిన ప్రధాని పవన్ కళ్యాణ్‌ను పట్టించుకోకపోవడంపై పెద్ద చర్చకు దారి తీస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మా చావుతో మీ అమ్మానాన్నలు సంతోషంగా ఉంటారు.. వివాహిత సూసైడ్ నోట్