Webdunia - Bharat's app for daily news and videos

Install App

మళ్లీ పెరిగిన సిలిండర్ ధరలు

Webdunia
బుధవారం, 1 జనవరి 2020 (16:02 IST)
సబ్సిడీయేతర సిలిండర్ ధరలు మళ్లీ పెరిగాయి. సబ్సిడీయేతర సిలిండర్‌పై రూ. 19 పెంచుతూ ఐఓసీ నిర్ణయం తీసుకుంది. ఈ పెరిగిన ధరలు నేటినుంచి అంటే జనవరి1, 2020 నుంచి అమలులోకి వస్తాయి.

గత అయిదు నెలలుగా సబ్సిడీయేతర సిలిండర్ ధరలు ప్రతినెల పెరుగుతూనే వస్తున్నాయి. గత ఆగష్టు నుంచి ఇప్పటివరకు సబ్సిడీయేతర సిలిండర్‌పై రూ. 140 పెరిగింది.
 
ఢిల్లీ మరియు ముంబైలలో, సబ్సిడీయేతర సిలిండర్‌కు వరుసగా రూ .19 మరియు రూ .19.5 చొప్పున పెరిగినట్లు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తెలిపింది. జనవరి 1 నుంచి సబ్సిడీయేతర సిలిండర్‌కు ఢిల్లీలో రూ .714, ముంబైలో రూ .684.50గా మారిందని ఐఓసీ తెలిపింది.

ఈ ధరలు డిసెంబరులో వరుసగా రూ. 695 రూపాయలు మరియు రూ. 665 రూపాయలుగా ఉన్నట్లు ఐఓసీ తెలిపింది. కోల్‌కతాలో రూ. 21.5 పెంచి సిలిండర్ ధర రూ. 747గా సవరించారు. చెన్నైలో రూ .74 పెంచి సిలిండర్ ధర రూ .734 సవరించారు.
 
డిసెంబర్ 1, 2019 నుంచి 19 కిలోల సిలిండర్ల ధరలను ఢిల్లీలో యూనిట్‌కు రూ .1,241కు, ముంబైలో రూ .1,190 కు సవరించారని ఇండియన్ ఆయిల్ తెలిపింది. ప్రస్తుతం 14 కేజీల సిలిండర్లు సంవత్సరానికి 12 సిలిండర్ల చొప్పున ప్రభుత్వం సబ్సిడీ కింద ఇస్తుంది. సంవత్సరానికి 12 సిలిండర్ల కోటాపై ప్రభుత్వం అందించే సబ్సిడీ మొత్తం ప్రతినెలా మారుతూ ఉంటుంది.

సంబంధిత వార్తలు

దేవర ఫియర్ సాంగ్ వర్సెస్ పుష్ప సాంగ్.. జరగండి అంటోన్న చెర్రీ

కనీసం నా పిల్లలతో చాక్లెట్ పార్టీకి కూడా తీరికలేదు, రేవ్ పార్టీనా?: జానీ మాస్టర్ - video

రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా

అబ్బాయిలూ ఇలా అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే చెంపలు చెళ్లుమంటాయి

పాయల్ రాజ్‌పుత్ పైన రక్షణ నిర్మాత ఫిలిం ఛాంబర్‌కు ఫిర్యాదు

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments