అతిపెద్ద విమాన వాహక నౌకలో భారీ అగ్నిప్రమాదం

Webdunia
గురువారం, 21 జులై 2022 (13:58 IST)
భారత నావికా దళానికి చెందిన అతిపెద్ద విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రమాదిత్యలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ప్రస్తుతం ఈ నౌక కర్వార్‌లో విధులు నిర్వహిస్తుంది. ఈ క్రమంలో బుధవారం రాత్రి 10.50 గంటల సమయంలో ఈ నౌకలో ఒక్కసారిగా మంటలు చెలరేగినట్టు నేవీ అధికారులు వెల్లడించారు. 
 
అయితే, మంటలు చెలరేగిన వెంటనే అప్రమత్తమైన సిబ్బంది తక్షణం మంటలను ఆర్పివేశారు. పైగా, ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సివుంది. 
 
మరోవైపు, ఈ నౌకను రష్యా నుంచి భారత్ కొనుగోలు చేసింది. దీని విలువ 2.3 బిలియన్ డాలర్లు. 2014లో ఇది రష్యా నుంచి ఇండియాకు చేరుకుంది. ప్రస్తుతం కర్ణాటక తీరంలోని కార్వార్‌లో ఈ నౌక ఉంది. 
 
ఈ విమాన వాహక నౌకపై మిగ్ 29కే ఫైటర్ జెట్లు, కమోవ్ హెలికాప్టర్లు ఉన్నాయి. ఐఎన్ఎస్ విక్రమాదిత్య 284 మీటర్ల పొడవు, 60 మీటర్ల ఎత్తుతో ఉంటుంది. 20 అంతస్తుల భవనం అంత ఎత్తును కలిగి ఉంటుంది. ఇండియన్ నేవీలో ఇదే అతి పెద్ద షిప్ కావడం గమనార్హం. దీని బరువు దాదాపు 40 వేల టన్నులు ఉంటుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Srinidhi Shetty: సీత పాత్ర మిస్ అయ్యా, వెంకటేష్, త్రివిక్రమ్ సినిమాలో చేయాలనుకుంటున్నా : శ్రీనిధి శెట్టి

Marriage Rumors: పెళ్లికి రెడీ అవుతున్న త్రిష.. చండీగఢ్‌ వ్యాపారవేత్తతో డుం.. డుం.. డుం..?

Teja: నటి సంతోషిని హెల్త్ కేర్ రిహాబిలిటేషన్ సెంటర్ లో దర్శకుడు తేజ

Charmi Kaur: విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్ మ్యూజిక్

అరి.. ప్రయాణంలో తండ్రిని, బావని కోల్పోయిన దర్శకుడు ఎమోషనల్ పోస్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బాదం పాలు తాగుతున్నారా?

ఈ దీపావళికి, ఫ్రెడెరిక్ కాన్‌స్టాంట్ తమ హైలైఫ్ లేడీస్ క్వార్ట్జ్ పండుగ బహుమతులు

బాలబాలికలకు శ్రీకృష్ణుడు చెప్పిన 8 ముఖ్యమైన సందేశాలు

దీపావళి డ్రెస్సింగ్, డెకర్: ఫ్యాబ్ఇండియా స్వర్నిమ్ 2025 కలెక్షన్‌

ధ్యానంతో అద్భుతమైన ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments