Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉభయగోదావరి ముంపు గ్రామాల్లో చంద్రబాబు పర్యటన

Webdunia
గురువారం, 21 జులై 2022 (13:42 IST)
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం ఉభయ గోదావరి జిల్లాల్లోని ముంపు గ్రామాల్లో పర్యటించనున్నారు. కోనసీమ జిల్లాతో పాటు ఈ జిల్లాకు సరిహద్దులో ఉన్న పశ్చిమగోదావరి జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. ముంపునకు గురైన లంక గ్రామాల్లో సిద్ధాంతం నుంచి కరుగోరు మిల్లు చేరుకొని అక్కడ నుంచి గోదావరి మధ్యలో ఉన్న అయోధ్య లంకకు వెళ్లనున్నారు.
 
ఆ తర్వాత రోడ్డు మార్గంలో మానేపల్లి పాలానికి వెళ్తారు. అక్కడ గోదావరిలో ఇద్దరి బాధిత కుటుంబాలను పరామర్శిస్తారు. అనంతరం అప్పనపల్లి చేరుకోనున్నారు. అప్పనపల్లిలో వరద బాధిత కుటుంబాలను పరామర్శించి... రోడ్డు మార్గంలో రాజోలు వెళ్లి ఇక్కడ నుంచి రాత్రి 7 గంటలకు పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు చేరుకుంటారు.
 
శుక్రవారం యలమంచిలి మండలంలో చంద్రబాబు పర్యటిస్తారు. దొడ్డిబట్ల, అబ్బిరాజుపాలెం, గంగాధరపాలెం, లక్ష్మీపురంలో వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలిస్తారు. నరసాపురం పరిధి పొన్నపల్లిలో చంద్రబాబు పర్యటన ముగియనున్నట్లు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హరిహర వీరమల్లు టాక్‌పై హైపర్ ఆది ఏమన్నారు?

Devarakonda, Sandeep reddy : కింగ్డమ్ బాయ్స్ ప్రచారానికి సిద్ధమయ్యారు

పవన్ కళ్యాణ్ వీరమల్లుకు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబునాయుడు

కమల్ హాసన్, రజనీకాంత్‌లపై లోకేష్ కనగరాజ్ దమ్మున్న ప్రకటన చేశాడు

మునుపెన్నడూ లేని విధంగా స్క్రీన్‌లపై కింగ్‌డమ్ విడుదల కాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments