Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

గూడ్సు రైలు ఢీకొని 80 గొర్రెల మృతి

sheeps die
, ఆదివారం, 10 జులై 2022 (18:55 IST)
తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం చిన్నమెట్‌పల్లి సమీపంలో ఆదివారం గూడ్స్‌ రైలు ఢీకొని 80 గొర్రెలు మృతి చెందాయి. గొర్రెలు రైల్వే ట్రాక్‌ దాటుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.
 
గొర్రెల కాపరి అయిన యజమాని, లక్కం రాజం ఉదయం గొర్రెలను మేత కోసం సమీప ప్రాంతాలకు తోలుకెళ్లాడు. గొర్రెలు కల్వర్టు సమీపంలో రైల్వే ట్రాక్ దాటుతుండగా గూడ్స్ రైలు ఢీకొంది.
 
దాదాపు 80 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి. గొర్రెల విలువ దాదాపు రూ.6 లక్షలు. తనకు ఆదాయ వనరులు లేకుండా పోయిందని, నష్టపరిహారం అందించాలని గొర్రెల యజమాని రాజం రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలంగాణాను ముంచెత్తుతున్న వర్షాలు.. రెడ్ అలెర్ట్