Webdunia - Bharat's app for daily news and videos

Install App

సుశాంత్ కేసు : సీబీఐ సమన్లతో ముంబై పోలీసుల వెన్నులో వణుకు

Webdunia
బుధవారం, 26 ఆగస్టు 2020 (07:48 IST)
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో భాగంగా సీబీఐ దర్యాప్తు కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో ఇద్దరు ముంబై పోలీసులకు సీబీఐ మంగళవారం సమన్లు జారీచేసింది. సుశాంత్‌ కేసును దర్యాప్తు చేసిన పోలీసు సిబ్బందిలో ఒకరైన భూషణ్ బెల్నేకర్‌కు, బాంద్రా పోలీస్ స్టేషన్ ఎస్ఐకి సీబీఐ సమన్లు పంపింది. 
 
ఇప్పటివరకూ సుశాంత్ కేసులో ముంబై పోలీసులు నిజాయితీగా దర్యాప్తు చేశారని మహారాష్ట్ర సీఎంతో సహా ఆ రాష్ట్ర మంత్రులు, శరద్ పవార్ కూడా చెప్పిన నేపథ్యంలో ముంబై పోలీసులకు సీబీఐ సమన్లు పంపడం చర్చనీయాంశంగా మారింది.
 
అంతేకాకుండా, ఈ కేసును సీబీఐకు అప్పగించడాన్ని కూడా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేతో పాటు.. పలువురు అధికార రాజకీయ పార్టీ నేతలు కూడా విమర్శించారు. కానీ, ఇపుడు ఇద్దరు పోలీసులకు సీబీఐ సమన్లు పంపడంతో ఈ కేసులో ఏదో గుట్టు దాగివుందనే విషయం తెలుస్తోంది. 
 
నిజానికి ముంబై పోలీసులు కేసు నుంచి సుశాంత్ ప్రియురాలు, సినీ నటి రియా చక్రవర్తిని ఉద్దేశపూర్వకంగా తప్పిస్తున్నారంటూ గతంలో కొన్ని వాదనలు కూడా తెరపైకొచ్చాయి. ఇప్పటికే సుశాంత్ కేసును దర్యాప్తు చేసిన బాంద్రా పోలీసుల నుంచి ఈ కేసుకు సంబంధించిన ఆధారలన్నింటినీ సీబీఐ ఇప్పటికే సేకరించింది.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

ఆనంది, వరలక్ష్మిశరత్‌కుమార్ థ్రిల్లర్ శివంగి ఆహా లో స్ట్రీమింగ్

ప్రతీ అమ్మాయి విజయం వెనుక ఓ అబ్బాయీ ఉంటాడు : డియర్ ఉమ సుమయ రెడ్డి

ఎన్టీఆర్, హృతిక్ నటించిన వార్-2 మొదటి మోషన్ పోస్టర్ మే లో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments