Webdunia - Bharat's app for daily news and videos

Install App

బంగారమైన గోమూత్రం.. పాల ధర కంటే అధికం...

రాజస్థాన్ రాష్ట్ర రైతుల పాలిట గోమూత్రం బంగారంగా మారింది. ఫలితంగా లీటరు గోమూత్రం ధర రూ.30 నుంచి 50 రూపాయల ధర పలుకుతోంది. ఆవు పాల కంటే మూత్రం ధర అధికంగా ఉండటం గమనార్హం. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాల

Webdunia
మంగళవారం, 24 జులై 2018 (14:15 IST)
రాజస్థాన్ రాష్ట్ర రైతుల పాలిట గోమూత్రం బంగారంగా మారింది. ఫలితంగా లీటరు గోమూత్రం ధర రూ.30 నుంచి 50 రూపాయల ధర పలుకుతోంది. ఆవు పాల కంటే మూత్రం ధర అధికంగా ఉండటం గమనార్హం. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
 
సాధారణంగా పుణ్యకార్యాల్లో గోమూత్రానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. అలాగే, సేంద్రీయ వ్యవసాయంతో రాష్ట్రంలో ఆవు మూత్రానికి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. దీంతో అక్కడి రైతులు హోల్‌సేల్ మార్కెట్లో గిర్, థార్పార్కర్ వంటి హైబ్రీడ్ ఆవుల మూత్రాన్ని లీటర్ రూ.15-30కి అమ్ముతున్నారు. 
 
రైతులకే అంత ధర వస్తుంటే వ్యాపారులు అదే మూత్రాన్ని లీటర్ రూ.30-50కి విక్రయిస్తున్నారు. అదే లీటర్ పాల ధర రూ.22-25 వరకు గిట్టుబాటు అవుతుండటంతో రాజస్థాన్ రైతులు గోమూత్రం అమ్మడమే జీవన వృత్తిగా మారుతున్నారు. 
 
ఆవు పాలతో పాటు గోమూత్రం కూడా అమ్మడంతో ఒక్కో పాడి రైతు కనీసం 30 శాతం ఆదాయ పెరుగుదలను కళ్ల జూస్తున్నాడు. సేంద్రీయ వ్యవసాయం చేసేవారు గోమూత్రాన్ని పురుగుమందులకు ప్రత్యామ్నాయంగా వాడుతున్నారు. ఇది కాకుండా ఔషధాల్లో, పూజాదికాల్లో కూడా గోమూత్రాన్ని విరివిగా వినియోగిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments