Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెన్నైలో నలుగురి ప్రాణాలు తీసిన రైల్ ఫుట్‍బోర్డు ప్రయాణం...

'ఫుట్‌బోర్డు ప్రయాణం.. ప్రమాదకరం' అని వాళ్లకు తెలుసు. అయినా కూడా.. ఉన్నది ఒక్కటే రైలు కావడంతో ఫుట్‌బోర్డుపైనే ఎక్కారు. రద్దీ ఎక్కువ అవడంతో ఫుట్‌బోర్డు మీదే దాదాపు పది నుంచి పదిహేను మంది వేలాడుతూ ప్రయా

Webdunia
మంగళవారం, 24 జులై 2018 (14:07 IST)
'ఫుట్‌బోర్డు ప్రయాణం.. ప్రమాదకరం' అని వాళ్లకు తెలుసు. అయినా కూడా.. ఉన్నది ఒక్కటే రైలు కావడంతో ఫుట్‌బోర్డుపైనే ఎక్కారు. రద్దీ ఎక్కువ అవడంతో ఫుట్‌బోర్డు మీదే దాదాపు పది నుంచి పదిహేను మంది వేలాడుతూ ప్రయాణిస్తున్నారు. ఎలాగైనా త్వరితగతిన గమ్యానికి చేరుకోవాలనే ఉద్దేశంతో ప్రమాదకర ప్రయాణం చేస్తున్న వారికి మార్గమధ్యలోనే మృత్యువు ఎదురైంది. గమ్యం చేరకుండానే వారి జీవితాలను కబలించి వేసింది. తమిళనాడు రాజధాని చెన్నైలో మంగళవారం ఉదయం జరిగిన విషాద ఘటన ఇది.
 
ఈ దుర్ఘటన మంగళవారం ఉదయం చెన్నై సెయింట్‌ థామస్‌ మౌంట్‌ రైల్వేస్టేషన్‌ సమీపంలో చెన్నై బీచ్‌-తిరుమాల్‌పూర్‌ లోకల్‌ రైలులో జరిగింది. రైలు బాగా రద్దీగా ఉండటంతో కొంతమంది ప్రయాణికులు ఫుడ్ బోర్డుపై నిల్చుని ప్రయాణిస్తున్నారు. సెయింట్‌ థామస్‌ మౌంట్‌ రైల్వేస్టేషన్‌ రైల్వే స్టేషన్ దగ్గరకు వస్తుండగానే కరెంట్ పోల్‌ను వారు ఢీకొట్టారు. దీంతో ఫుట్‌బోర్డులో ఉన్న ప్రయాణికులంతా కిందపడిపోయారు. ఇందులో నలుగురు అక్కడి కక్కడే చనిపోగా… మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి రైల్వే అధికారులు తరలించారు.  

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments