Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైతులకు శుభవార్త చెప్పిన ఐఎండీ... స్మార్ట్ ఫోన్ అవసరం లేదు.. ఎస్ఎంఎస్ ద్వారా?

Webdunia
బుధవారం, 8 జూన్ 2022 (13:44 IST)
రైతులకు శుభవార్త. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడంతో పాటు వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు రంగం సిద్ధం అవుతోంది. ఇందుకోసం భారత వాతావరణ శాఖ రైతులకు మరింత సాయం చేసేందుకు రెడీ అవుతోంది. 
 
రైతులకు స్థానిక భాషల్లో ఎస్ఎమ్ఎస్ ద్వారా వాతావరణ సూచనను అందించే స్కీమ్‌పై ఐఎండీ రెడీ అవుతోంది. ఈ సేవ పూర్తిగా ఉచితంగా అందించనుంది. ఈ సేవ కోసం హెల్ప్ లైన్ నంబర్ జారీ చేయనున్నారు.
 
ప్రాంతీయ స్థాయిలో వాతావరణ సంబంధిత సమాచారం అందుబాటులో ఉండటం వల్ల రైతులు ఎరువులు, ఇతర ఇన్‌పుట్‌ల వినియోగం, నీటిపారుదల వంటి వ్యవసాయ కార్యకలాపాలపై తగిన నిర్ణయాలు తీసుకోవడానికి సహాయపడుతుంది. సాధారణ పౌరులు కూడా కామన్ ఫోన్ నంబర్‌ని ఉపయోగించి తమ ప్రాంతంలో వాతావరణ సూచనను తెలుసుకోవచ్చు.
 
దేశంలోని ఏ ప్రాంతమైన రైతు తన గ్రామం లేదా బ్లాక్ కోసం రాబోయే ఐదు రోజులలో వర్షం, ఉష్ణోగ్రత, తేమ, గాలి వేగం వంటి వాతావరణ సమాచారాన్ని పొందవచ్చు. ఐఎండీ ప్రత్యేక బృందం ఈ అప్లికేషన్‌పై పని చేస్తుంది.
 
ప్రస్తుతం రైతులకు స్మార్ట్ ఫోన్లు లేకపోవడం కారణంగా వారు వాతావరణ సంబంధిత సమాచారాన్ని పొందలేరు. తాజా కొత్త పథకం కింద అందించే సమాచారం ఆ ప్రాంతానికి మరింత నిర్దిష్టంగా ఉంటుంది. తద్వారా ఇది రైతుకు మరింత ఉపయోగకరంగా ఉంటుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రహస్యంగా పెళ్లి చేసుకున్న బాలీవుడ్ నటి!

కర్నాటక సీఎం సిద్ధూతో చెర్రీ సమావేశం.. ఫోటోలు వైరల్

నేటి ట్రెండ్ కు తగ్గట్టు కంటెంట్ సినిమాలు రావాలి : డా: రాజేంద్ర ప్రసాద్

దుబాయిలో వైభవ్ జ్యువెలర్స్ ప్రెజెంట్స్ Keinfra Properties గామా అవార్డ్స్

నేచురల్ స్టార్ నాని చిత్రం ది ప్యారడైజ్ కోసం హాలీవుడ్ కొలాబరేషన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments