Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్మశానాల్లో శవం దహనం చేయాలంటే రూ.5 వేలు చెల్లించాల్సిందే...

Webdunia
మంగళవారం, 20 డిశెంబరు 2022 (09:13 IST)
శ్మశానాల్లో శవం దహనం చేయడానికి కూడా ఫీజును నిర్ణయించారు. ఈ వింత పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏలుబడిలో సాగుతోంది. ఇప్పటికే చెత్తపన్ను పేరుతో ప్రజలపై భారం మోపింది. ఇపుడు ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్‌లో శవదహనానికి కూడా ఫీజును నిర్ణయించింది. ఈ మేరకు ఏలూరు నగరపాలక సంస్థ తీర్మానం చేసింది. 
 
శ్మశానాల్లో శవ దహనానికి రూ.5 వేలు చొప్పున వసూలు చేయాలని పాలక వర్గం నిర్ణయించింది. ఇందులో కట్టెలు, డీజిల్ లేదా పెట్రోలు ఖర్చులు కలిసే ఉంటాయి. ఈ నెల 13వ తేదీన నిర్వహించిన సర్వసభ్య సమావేశ ఎజెండాలో రుసుము వసూలును 53వ అంశంగా చేర్చారు. ప్రస్తుతం ఈ అంశం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. 
 
సాధారణంగా పట్టణ స్థానిక సంస్థలు చట్టపరంగా సామాజిక బాధ్యతగా ప్రజలకు కొన్ని సేవలు ఉచితంగా అందించాలి. ఇంకొన్నింటిపై నామమాత్రపు రుసుంను విధించాలి. పుర, నగరపాలక సంస్థలు ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నాయి. ప్రజల నుంచి భారీగా పన్నులు, ఇతర రుసుములు వసూలు చేస్తూనే, కొన్ని సేవలపై ఖర్చుకి తగ్గ సమాన మొత్తాలను ప్రజల నుంచే రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వార్ 2 లో ఎన్.టి.ఆర్. మాటలే అనంతపురంలో వివాదానికి కారణమయిందా?

ఒంటికి ఆయిల్ పూసుకున్నా నభా నటేష్ అవకాశాలు రావడంలేదా?

బుల్లి సినిమాలు గురించి మేధావులు ఆలోచించండి : రామ సత్యనారాయణ

పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో రాజేంద్ర ప్రసాద్ నటించిన నేనెవరు?

మెగాస్టార్ చిరంజీవి చిత్రాల అప్ డేట్స్ ఒకవైపు - కార్మికుల సమస్యలకు మరోవైపు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments