Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్మశానాల్లో శవం దహనం చేయాలంటే రూ.5 వేలు చెల్లించాల్సిందే...

Webdunia
మంగళవారం, 20 డిశెంబరు 2022 (09:13 IST)
శ్మశానాల్లో శవం దహనం చేయడానికి కూడా ఫీజును నిర్ణయించారు. ఈ వింత పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏలుబడిలో సాగుతోంది. ఇప్పటికే చెత్తపన్ను పేరుతో ప్రజలపై భారం మోపింది. ఇపుడు ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్‌లో శవదహనానికి కూడా ఫీజును నిర్ణయించింది. ఈ మేరకు ఏలూరు నగరపాలక సంస్థ తీర్మానం చేసింది. 
 
శ్మశానాల్లో శవ దహనానికి రూ.5 వేలు చొప్పున వసూలు చేయాలని పాలక వర్గం నిర్ణయించింది. ఇందులో కట్టెలు, డీజిల్ లేదా పెట్రోలు ఖర్చులు కలిసే ఉంటాయి. ఈ నెల 13వ తేదీన నిర్వహించిన సర్వసభ్య సమావేశ ఎజెండాలో రుసుము వసూలును 53వ అంశంగా చేర్చారు. ప్రస్తుతం ఈ అంశం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. 
 
సాధారణంగా పట్టణ స్థానిక సంస్థలు చట్టపరంగా సామాజిక బాధ్యతగా ప్రజలకు కొన్ని సేవలు ఉచితంగా అందించాలి. ఇంకొన్నింటిపై నామమాత్రపు రుసుంను విధించాలి. పుర, నగరపాలక సంస్థలు ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నాయి. ప్రజల నుంచి భారీగా పన్నులు, ఇతర రుసుములు వసూలు చేస్తూనే, కొన్ని సేవలపై ఖర్చుకి తగ్గ సమాన మొత్తాలను ప్రజల నుంచే రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సారీ మాత్రమే చెప్పగలను... ఎక్కువ అంచనా వేసి బోల్తాపడ్డాం : మణిరత్నం

Nidhi: రాజా సాబ్ తో గ్లామర్ డోస్ పెంచుకున్న నిధి అగర్వాల్

నా పర్సనల్ లైఫ్ కూడా చాలా చోట్ల కనెక్ట్ అయ్యింది : అనంతిక

థ్రిల్లర్ నేపథ్యంలో సిద్ధార్థ్, శ్రీ గణేష్, అరుణ్ విశ్వ చిత్రం 3 BHK

విజయ్ ఆంటోనీ మార్గన్ నుంచి సోల్ ఆఫ్ మార్గన్’ లిరికల్ వీడియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

తర్వాతి కథనం
Show comments