Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ హోటల్‌లో భోజనం చేస్తే.. రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ ఫ్రీ...

Webdunia
శుక్రవారం, 22 జనవరి 2021 (09:51 IST)
పూణెలోని ఓల్డ్‌ ముంబై - పూణె హైవేపై వడ్‌గావ్‌ మవల్‌ అనే ప్రాంతంలో హోటల్‌ శివరాజ్‌ ఉంది. అక్కడ బుల్లెట్‌ థాలి పేరిట ఓ ప్రత్యేకమైన భోజనం లభిస్తుంది. దాని ధర రూ. 2.500. ఆ భోజనాన్ని కనీసం ఏడుగురు తినవచ్చు.

అందులో ఫిష్‌, ఫ్రాన్స్‌, మటన్‌, చికెన్‌ తదితర 12 రకాల డిషెస్‌ ఉంటాయి. అయితే ఆ భోజనాన్ని కేవలం ఒకే ఒక వ్యక్తి 60 నిమిషాల్లో.. అంటే ఒక గంటలో తినాలి. అది కూడా కంచంలో ఒక్క మెతుకు కూడా లేకుండా.. ఇచ్చిన టైమ్‌ లిమిట్‌లోనే ఏమీ మిగల్చకుండా పూర్తిగా తినేసేయాలి. ఇలా తింటే రాయల్‌ఎన్‌ఫీల్డ్‌ వాహనాన్ని బహుమతిగా ఇస్తారు. ఇలా బహుమతిగా ఇచ్చే బైక్స్‌ను షాపులోనే డిస్‌ప్లేకు ఉంచుతున్నారు.

ఇప్పటివరకు ఈ ఆఫర్‌ను చాలామంది స్వీకరించారు. కానీ కేవలం ఒకేఒక్క వ్యక్తి మాత్రమే ఇప్పటివరకు ఆ భోజనాన్ని గంటలో తిని బైక్‌ను సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత ఇంకెవ్వరూ మళ్లీ విన్నర్‌ కాలేకపోయారు. కరోనా నేపథ్యంలో బిజినెస్‌ సరిగ్గా లేకపోవడం వల్లే ఆ హోటల్‌ ఇంత ఖరీదైన ఆఫర్‌ను ప్రకటించిందట.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments