Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హోటల్ యాజమాన్యాలు ప్రభుత్వానికి సహాయపడాలి: గుంటూరు జిల్లా కలెక్టర్

Advertiesment
Hotel owners
, గురువారం, 7 మే 2020 (19:17 IST)
కరోనా వైరస్ నేపధ్యంలో విదేశాలలో చిక్కుకున్న తెలుగు వారిని వారి స్వస్థలాలకు చేర్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని, విదేశాల నుండి వచ్చే వారిని ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం క్వారంటైన్ చేసి పర్యవేక్షణ చేస్తామని జిల్లా కలెక్టర్ ఐ శామ్యూల్ ఆనంద్ కుమార్ పేర్కొన్నారు.

గురువారం కలక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో విదేశాల నుండి వచ్చే వారిని హోటల్ క్వారంటైన్ లో ఉంచేందుకు చేపట్టవలసిన ఏర్పాట్లపై గుంటూరులోని హోటల్ యజమానులతో జిల్లా కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హోటల్ యజమానులతో మాట్లాడుతూ, జిల్లాలో ఎన్ని హోటళ్ళు వున్నాయి, వాటిలో ఎన్ని సింగల్, డబల్ రూములు గలవి వున్నాయి, వాటి టారిఫ్ రెట్లు తెలియజేయాలన్నారు.  హోటళ్ళలో రెస్టారెంట్ వుంటే అల్పాహారం, భోజనం, డిన్నర్ కు మెనూ తయారు చేసి వాటి రెట్లు కూడా తెలియజేయాలన్నారు. 
 
రెస్టారెంట్ లేని వారు రూము టారిఫ్ ను కోడ్ చేయాలని తెలిపారు.  ఈ కరోనా సమయంలో హోటల్ యాజమాన్యాలు ప్రభుత్వానికి సహాయపడాలని కోరారు. ఈ సమావేశంలో  జిల్లా హోటల్ యాజమాన్యాల అసోసియేషన్ ప్రెసిడెంట్ వి రాయల్ పార్క్ హోటల్ యజమాని కిశోర్, వివిధ హోటల్ యాజమాన్యాల ప్రతినిధులు పాల్గొన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విశాఖ గ్యాస్ బాధితులకు ఆరోగ్యశ్రీ అండ.. విశాఖ ఆరోగ్య శ్రీ హెల్ప్ లైన్ నెం. +91 - 8333814019