Webdunia - Bharat's app for daily news and videos

Install App

విధ్వంసానికి ఉగ్రమూకల కుట్ర - దేశ వ్యాప్తంగా హైఅలెర్ట్

Webdunia
గురువారం, 8 ఆగస్టు 2019 (13:16 IST)
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో అమలు చేస్తూ వచ్చిన 370 అధికరణను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఈ చర్యను పాకిస్థాన్‌తో పాటు పాక్ ప్రేరేపిత ఉగ్రమూకలు ఏమాత్రం జీర్ణించుకోలేక పోతున్నాయి. దాడులతో విధ్వంసం సృష్టించాలని కుట్ర పన్నినట్టు వార్తలు వస్తున్నాయి. దీంతో దేశ వ్యాప్తంగా హైఅలెర్ట్‌ను కేంద్రం ప్రకటించింది.
 
దేశంలో ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో అన్ని అంతర్జాతీయ విమానాశ్రయంలో విస్తృతంగా తనిఖీలు జరుగుతున్నాయి. జమ్మూకాశ్మీరులో ప్రతి కిలోమీటరుకి ఒక సీఆర్పీఎఫ్ క్యాంపును ఏర్పాటు చేశారు. అలాగే, దేశవ్యాప్తంగా సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా పెట్టారు. 
 
అన్ని రాష్ట్రాల పోలీసులు ఎప్పటికప్పుడు అప్డేట్ ఇవ్వాలని కేంద్రం ఆదేశించింది. కాశ్మీరు అంశంపై భారత్ తీసుకున్న నిర్ణయంతో రగిలిపోతున్న ఉగ్రవాదులు దాడులకు తెగబడేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారని పేర్కొంది. 
 
ఈ ఉగ్రమూకలు సామాన్య ప్రజానికమే లక్ష్యంగా విరుచుకుపడేలా ఉగ్ర సంస్థలు జైషే మొహమ్మద్, లష్కరే తోయిబాలు కుట్రపన్నాయి. దీంతో ఢిల్లీ ,రాజస్థాన్, పంజాబ్, గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు హెచ్చరికలు జారీచేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments