Webdunia - Bharat's app for daily news and videos

Install App

హెలికాఫ్టర్ మృతులకు పూలవర్షంతో వీడ్కోలు పలికిన స్థానికులు

Webdunia
గురువారం, 9 డిశెంబరు 2021 (15:38 IST)
నీలగిరి జిల్లా కున్నూరు సమీపంలో బుధవారం హెలికాఫ్టర్ కూలి ప్రాణాలు కోల్పోయిన మృతులకు స్థానికులు కన్నీటితో అంజలి ఘటించారు. భౌతికకాయాలు కలిగిన శవపేటికలను వారివారి స్వస్థాలకు తరలించేందుకు వ్యానుల్లో ఎక్కించి తరలించారు. ఆ వాహనాలు వచ్చిన రోడ్డుకు ఇరువైపులా బారులు తీరిన స్థానికులు పూలవర్షం కురిపిస్తూ, కన్నీటితో తుది వీడ్కోలు పలికారు. దీనికి సంబంధించిన వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 
 
కాగా, ఈ హెలికాఫ్టర్ ప్రమాదంలో త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్, ఆయన సతీమణి మధులిక రావత్‌తో పాటు మరో 11 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెల్సిందే. ఈ భౌతికకాయాలను నీలగిరి జిల్లా మద్రాస్ రెజిమెంటల్ సెంటర్ నుంచి సులూర్ ఎయిర్‌బేస్‌కు అంబులెన్స్‌లలో తరలించారు. 
 
ఈ సందర్భంగా స్థానికులు రోడ్డుకు ఇరువైపులా బారులు తీరారు. బిపిన్ రావత్, ఆయన అర్థాంగి, ఇతర సిబ్బంది భౌతికకాయాలను తీసుకెళుతున్న అంబులెన్స్‌లపై స్థానికులు పూలవర్షం కురిపించారు. అనంతరం వారి మృతదేహాలను సులూర్ ఎయిర్‌బేస్‌కు తరలించి, అక్కడ నుంచి ఢిల్లీకి ప్రత్యేక విమానంలో తరలించారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments