Webdunia - Bharat's app for daily news and videos

Install App

హెలికాఫ్టర్ మృతులకు పూలవర్షంతో వీడ్కోలు పలికిన స్థానికులు

Webdunia
గురువారం, 9 డిశెంబరు 2021 (15:38 IST)
నీలగిరి జిల్లా కున్నూరు సమీపంలో బుధవారం హెలికాఫ్టర్ కూలి ప్రాణాలు కోల్పోయిన మృతులకు స్థానికులు కన్నీటితో అంజలి ఘటించారు. భౌతికకాయాలు కలిగిన శవపేటికలను వారివారి స్వస్థాలకు తరలించేందుకు వ్యానుల్లో ఎక్కించి తరలించారు. ఆ వాహనాలు వచ్చిన రోడ్డుకు ఇరువైపులా బారులు తీరిన స్థానికులు పూలవర్షం కురిపిస్తూ, కన్నీటితో తుది వీడ్కోలు పలికారు. దీనికి సంబంధించిన వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 
 
కాగా, ఈ హెలికాఫ్టర్ ప్రమాదంలో త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్, ఆయన సతీమణి మధులిక రావత్‌తో పాటు మరో 11 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెల్సిందే. ఈ భౌతికకాయాలను నీలగిరి జిల్లా మద్రాస్ రెజిమెంటల్ సెంటర్ నుంచి సులూర్ ఎయిర్‌బేస్‌కు అంబులెన్స్‌లలో తరలించారు. 
 
ఈ సందర్భంగా స్థానికులు రోడ్డుకు ఇరువైపులా బారులు తీరారు. బిపిన్ రావత్, ఆయన అర్థాంగి, ఇతర సిబ్బంది భౌతికకాయాలను తీసుకెళుతున్న అంబులెన్స్‌లపై స్థానికులు పూలవర్షం కురిపించారు. అనంతరం వారి మృతదేహాలను సులూర్ ఎయిర్‌బేస్‌కు తరలించి, అక్కడ నుంచి ఢిల్లీకి ప్రత్యేక విమానంలో తరలించారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chinmayi: చిన్మయికి గంగై అమరన్ మద్దతు-సార్ ఆలోచించుకోండి.. సీఎం హౌస్ పక్కనే వుంది

మాల్దీవులకు బ్రాండ్ అంబాసిడర్‌గా కత్రినా కైఫ్

Ramya Pasupuleti : బికినీలో ఫిలిప్పీన్ బీచ్ లో రమ్య పసుపులేటి గ్లామర్ టీట్ చేస్తోంది

సయారా నుంచి జుబిన్ పాడిన రొమాంటిక్ ట్రాక్ బర్బాద్ విడుదల

ప్రభుత్వం గుర్తింపు ముందుకు వెళ్లేందుకు తోడ్పడతాయి : నాగ అశ్విన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments