ఐఎఎఫ్ హెలికాఫ్టర్ ప్రమాదం: గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ ఇకలేరు

Webdunia
బుధవారం, 15 డిశెంబరు 2021 (14:07 IST)
డిసెంబరు 8న తమిళనాడులోని కానూరులో జరిగిన ఐఏఎఫ్ హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలతో బయటపడిన గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ గాయాలతో మరణించినట్లు భారత వైమానిక దళం (ఐఏఎఫ్) బుధవారం వెల్లడించింది.

 
కానూర్ సమీపంలో జరిగిన ప్రమాదంలో భారతదేశపు అత్యంత సీనియర్ సైనిక అధికారి, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్, ఆయన భార్య మధులికతో సహా మరో 11 మంది మరణించిన సంగతి తెలిసిందే.

 
బుధవారం IAF ట్వీట్లో ఇలా పేర్కొంది, “8 డిసెంబర్ 21న హెలికాప్టర్ ప్రమాదంలో గాయపడి ఈ ఉదయం మరణించిన ధైర్యవంతుడు గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ మరణించిన విషయాన్ని తెలియజేయడానికి చింతిస్తున్నాం. IAF హృదయపూర్వక సంతాపాన్ని తెలియజేస్తుంది."

 
ఆయన మృతి తనను కలచివేసిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. “గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ దేశానికి గర్వకారణం, ఆయన పరాక్రమం, అత్యంత వృత్తి నైపుణ్యంతో సేవ చేశారు. ఆయన మృతి పట్ల నేను తీవ్ర వేదనకు లోనయ్యాను. దేశానికి ఆయన చేసిన గొప్ప సేవ ఎన్నటికీ మరువలేనిది. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఓం శాంతి' అని ట్వీట్‌ చేశారు.
 

 
39 ఏళ్ల ఆయన రక్షణ కుటుంబానికి చెందినవారు, ఆయన సోదరుడు ఇండియన్ నేవీలో పనిచేస్తున్నారు. ఆయన తండ్రి కల్నల్ (రిటైర్డ్) కెపి సింగ్ ఆర్మీ ఎయిర్ డిఫెన్స్‌లో పనిచేసారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హోటల్ గదిలో ఆత్మను చూశాను... : హీరోయిన్ కృతిశెట్టి

ఫ్యాన్స్‌కు మెగా ఫీస్ట్ - ఎంఎస్‌జీ నుంచి 'శశిరేఖ' లిరికల్ సాంగ్ రిలీజ్ (Video)

థర్డ్ పార్టీల వల్లే సినిమాల విడుదలకు బ్రేక్ - యధావిధిగా ది రాజాసాబ్‌ రిలీజ్ : నిర్మాత విశ్వప్రసాద్

Nandamuri Kalyan: ఛాంపియన్ తో 35 ఏళ్ల తర్వాత నందమూరి కళ్యాణ్ చక్రవర్తి రీఎంట్రీ

మంత్రి సీతక్క లాంచ్ చేసిన కామాఖ్య ఇంటెన్స్ థ్రిల్లింగ్ ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

తర్వాతి కథనం
Show comments