Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోడీని దేశ ప్రధానిగా చేసి పశ్చాత్తాప పడుతున్నా : రాంజెఠ్మలానీ

ప్రధాని నరేంద్ర మోడీపై రాజ్యసభ సభ్యుడు, ప్రముఖ సీనియర్ క్రిమినల్ న్యాయవాది రాంజెఠ్మలానీ మండిపడ్డారు. మోడీని దేశ ప్రధానిగా చేసినందుకు తాను ఇపుడు పశ్చాత్తాప పడుతున్నట్టు చెప్పుకొచ్చారు.

Webdunia
మంగళవారం, 8 మే 2018 (08:33 IST)
ప్రధాని నరేంద్ర మోడీపై రాజ్యసభ సభ్యుడు, ప్రముఖ సీనియర్ క్రిమినల్ న్యాయవాది రాంజెఠ్మలానీ మండిపడ్డారు. మోడీని దేశ ప్రధానిగా చేసినందుకు తాను ఇపుడు పశ్చాత్తాప పడుతున్నట్టు చెప్పుకొచ్చారు. మోడీ కోసం తన అమూల్యమైన సమయాన్ని వెచ్చించానని, ఇపుడు అదంతా బూడిదలో పోసిన పన్నీరులా మారిందని వ్యాఖ్యానించారు.
 
ఆయన బెంగుళూరులో విలేకరులతో మాట్లాడుతూ, నరేంద్ర మోడీని ప్రధానిగా చేసేందుకు తన అమూల్య సమయాన్ని వెచ్చించానని, ఇందుకు పశ్చాత్తాప పడుతున్నట్టు చెప్పారు. మోడీ ప్రధాని అయినా దేశ ప్రజలకు ఎలాంటి ప్రయోజనమూ కలగడం లేదన్నారు.
 
ముఖ్యంగా, గత ఎన్నికల సమయంలో విదేశీ బ్యాంకుల్లో మగ్గుతున్న రూ.90 లక్షల కోట్ల నల్లధనాన్ని వెనక్కి, ప్రతి సామాన్యుడి ఖాతాలో రూ.15 లక్షలు జమచేస్తానని మోడీ హామీ ఇచ్చారని, కానీ, ప్రధాని అయ్యాక ఈ హామీనే పూర్తిగా విస్మరించారన్నారు. పైగా, మోడీ ప్రధాని అయ్యాక జరిగిన ఎన్నికల్లో పీకల్లోతు అవినీతిలో కూరుకుని జైలుపాలైన వారందరికీ బీజేపీ టికెట్లు ఎలా ఇచ్చారు? ఇవేనా మీ నైతిక రాజకీయాలు?.. అని జెఠ్మలానీ నిలదీశారు.  

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments