Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోడీని దేశ ప్రధానిగా చేసి పశ్చాత్తాప పడుతున్నా : రాంజెఠ్మలానీ

ప్రధాని నరేంద్ర మోడీపై రాజ్యసభ సభ్యుడు, ప్రముఖ సీనియర్ క్రిమినల్ న్యాయవాది రాంజెఠ్మలానీ మండిపడ్డారు. మోడీని దేశ ప్రధానిగా చేసినందుకు తాను ఇపుడు పశ్చాత్తాప పడుతున్నట్టు చెప్పుకొచ్చారు.

Webdunia
మంగళవారం, 8 మే 2018 (08:33 IST)
ప్రధాని నరేంద్ర మోడీపై రాజ్యసభ సభ్యుడు, ప్రముఖ సీనియర్ క్రిమినల్ న్యాయవాది రాంజెఠ్మలానీ మండిపడ్డారు. మోడీని దేశ ప్రధానిగా చేసినందుకు తాను ఇపుడు పశ్చాత్తాప పడుతున్నట్టు చెప్పుకొచ్చారు. మోడీ కోసం తన అమూల్యమైన సమయాన్ని వెచ్చించానని, ఇపుడు అదంతా బూడిదలో పోసిన పన్నీరులా మారిందని వ్యాఖ్యానించారు.
 
ఆయన బెంగుళూరులో విలేకరులతో మాట్లాడుతూ, నరేంద్ర మోడీని ప్రధానిగా చేసేందుకు తన అమూల్య సమయాన్ని వెచ్చించానని, ఇందుకు పశ్చాత్తాప పడుతున్నట్టు చెప్పారు. మోడీ ప్రధాని అయినా దేశ ప్రజలకు ఎలాంటి ప్రయోజనమూ కలగడం లేదన్నారు.
 
ముఖ్యంగా, గత ఎన్నికల సమయంలో విదేశీ బ్యాంకుల్లో మగ్గుతున్న రూ.90 లక్షల కోట్ల నల్లధనాన్ని వెనక్కి, ప్రతి సామాన్యుడి ఖాతాలో రూ.15 లక్షలు జమచేస్తానని మోడీ హామీ ఇచ్చారని, కానీ, ప్రధాని అయ్యాక ఈ హామీనే పూర్తిగా విస్మరించారన్నారు. పైగా, మోడీ ప్రధాని అయ్యాక జరిగిన ఎన్నికల్లో పీకల్లోతు అవినీతిలో కూరుకుని జైలుపాలైన వారందరికీ బీజేపీ టికెట్లు ఎలా ఇచ్చారు? ఇవేనా మీ నైతిక రాజకీయాలు?.. అని జెఠ్మలానీ నిలదీశారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments