Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్త చెడు వ్యసనాలు తట్టుకోలేక మరొక వ్యక్తితో శారీరక సంబంధం, అతను కూడా...?

Webdunia
మంగళవారం, 11 ఆగస్టు 2020 (19:51 IST)
హర్యానాలోని కురుక్షేత్రజిల్లా బోహ్లి ప్రాంతమది. పింకీకి అదే ప్రాంతానికి చెందిన రవితో పదేళ్ళ క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. భర్త డ్రగ్స్‌కి బానిసయ్యాడు. సంపాదించిన డబ్బంతా దానికే ఖర్చు పెట్టేవాడు. ఇంట్లో తినడానికి తిండి కూడా లేకపోయినా పట్టించుకునేవాడు కాదు.
 
దీంతో అతనితో విబేధించి పిల్లలను తీసుకుని బయటకు వచ్చేసింది అతడి భార్య. థానేసర్ లోని ఆకాష్ నగర్లో ఒక ఇంటిని అద్దెకు తీసుకుంది. ఐతే ఆమెపై ఇంటి యజమాని గంగాసింగ్ కన్నేశాడు. అసలే ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా వుండటతో అతడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. కూలి పనిచేసుకుంటూ పిల్లలను చదివిస్తూ ఉండేది. పిల్లలకు అనుమానం రాకుండా ఇంటి యజమానితో సంబంధాన్ని కొనసాగించేది. 
 
అయితే గంగాసింగ్ కూడా మద్యానికి బానిసయ్యాడు. ఇంట్లో ఉన్న డబ్బులను ఖర్చు చేసి పింకీ దగ్గరకు వచ్చి ఆమె దగ్గరకు డబ్బులు తీసుకెళ్ళేవాడు. ఏమయినా ఎదురుతిరిగి మాట్లాడితే తమ మధ్య వున్న సంబంధం బయటపెడతానంటూ బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. కష్టపడి పనిచేసిన డబ్బును గంగాసింగ్ తీసుకెళ్ళి తాగేయడంతో మొదట్లో తాను ఎదుర్కొన్న పరిస్థితే మళ్ళీ ఆమెకు ఎదురైంది. గంగాసింగ్ పైన కోపం తెచ్చుకుంది.
 
అతనిపై చేయి చేసుకుంది. దీంతో గంగాసింగ్ ఆమెను ఎలాగైనా చంపేయాలనుకున్నాడు. పూటుగా మద్యం సేవించి నేరుగా ఇంటికి వచ్చి ఆమెను గోడకేసి కొట్టి చంపేశాడు. ఆ తర్వాత నిందితుడు నేరుగా స్టేషన్‌కు వెళ్ళి లొంగిపోయాడు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments