Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎద్దుకు అంత్యక్రియలు - గ్రామస్థులపై పోలీస్ కేసు

Webdunia
శనివారం, 18 ఏప్రియల్ 2020 (11:13 IST)
తమిళ సంప్రదాయంలో మిళితమైన క్రీడ జల్లికట్టు ఒకటి. ఈ క్రీడా పోటీలను సంక్రాంతి సంబరాల్లో భాగంగా ప్రతి యేటా నిర్వహిస్తుంటారు. తమిళనాడులోని దక్షిణాది జిల్లాల్లో ఈ క్రీడకు అత్యంత ప్రాధాన్యత ఉంది. పైగా, ఈ క్రీడలో పాల్గొనే ఎద్దులను ఒక యేడాది నుంచి సిద్ధం చేస్తుంటారు. అలా ప్రతి యేటా జల్లి కట్టు క్రీడలో పాల్గొనే ఎద్దు ఒకటి చనిపోయింది. దీనికి ఆ ప్రాంతానికి చెందిన గ్రామస్థులంతా కలిసి అంత్యక్రియలు నిర్వహించారు. 
 
మదురై జిల్లాలోని అలంగానల్లూరులో ప్రతి యేటా నిర్వహించే జల్లికట్టు పోటీల్లో పాల్గొనే ఓ ఎద్దు చనిపోయింది. దానికి అంత్యక్రియలు నిర్వహించడం కోసం ఆ ఊర్లోని వందలాది మంది గుమిగూడారు. ఎద్దు మృతదేహాన్ని పూలతో కప్పి, దానికి అంత్యక్రియలు నిర్వహించారు. 
 
ఇలా చేయడం ప్రస్తుతం అమల్లో ఉన్న లాక్‌డౌన్ ఆంక్షలకు విరుద్ధం. అందుకే ఈ విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు అక్కడకు చేరుకుని అంత్యక్రియల్లో పాల్గొన్న పలువురిని అరెస్టు చేశారు. ఈ విషయాన్ని మదురై జిల్లా కలెక్టర్ టీజీ వినయ్ తెలిపారు. 

సంబంధిత వార్తలు

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

కోదండరామి రెడ్డి ఆవిష్కరించిన ఇట్లు... మీ సినిమా పోస్టర్

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలలో సుమయా రెడ్డి‌ నటిస్తున్న డియర్ ఉమ

విక్రాంత్, చాందినీ చౌదరి జంటకు సంతాన ప్రాప్తిరస్తు

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments