Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కరోనా వైరస్ ధనవంతులనే కాటేస్తుంది ... తమిళనాడు సీఎం

కరోనా వైరస్ ధనవంతులనే కాటేస్తుంది ... తమిళనాడు సీఎం
, శుక్రవారం, 17 ఏప్రియల్ 2020 (09:44 IST)
కరోనా వైరస్ వ్యాప్తిపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి కె. పళనిస్వామి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ కరోనా వైరస్ వ్యాధి కేవలం ధనవంతుల వ్యాధి అని, ఈ వైరస్ ఎక్కువగా ధనవంతులకే సోకుతుందని ఆయన వ్యాఖ్యానించారు. 
 
ప్రపంచాన్ని కబళించిన కరోనా వైరస్‌ వ్యాప్తిపై ఆయన స్పందిస్తూ, ఈ కరోనా వైరస్‌ను ధనవంతులే రాష్ట్రంలోకి తీసుకొచ్చారని వ్యాఖ్యానించారు. పైగా, ఈ వైరస్ ధనవంతులకే సోకుతుందని, విదేశాలు, ఇతర రాష్ట్రాలకు వెళ్లి వచ్చిచన వారి ద్వారానే ఈ వైరస్ రాష్ట్రంలోకి దిగుమతి అయిందని ఆయని చెప్పుకొచ్చారు. 
 
అలాగే, ఈ ప్రాణాంతక వైరస్ రాష్ట్రంలో పుట్టినది కాదనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలన్నారు. ఈ వైరస్ నివారణ సవాలుతో కూడుకున్నదని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో వైరస్ మరింత విస్తరించకుండా విజయవంతంగా అడ్డుకోగలిగామని పళనిస్వామి చెప్పారు.
 
కాగా, తమిళనాడులో గురువారం కొత్తగా 25 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1267కు పెరిగింది. అలాగే, ఈ వైరస్ బారినపడి ఒకరు మృతి చెందడంతో మొత్తం మృతుల సంఖ్య 15కు చేరుకుంది. రాష్ట్రంలో ఇప్పటివరకు 180 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని, ఇంకా 1072 యాక్టివ్ కేసులు ఉన్నాయని పళనిస్వామి వివరించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

న్యూయార్క్‌లో నెలరోజుల పాటు లాక్ డౌన్.. ఒక్కరోజే 606 మంది మృతి