Webdunia - Bharat's app for daily news and videos

Install App

భలే దొంగ.. విమానం ప్రయాణం.. గూగుల్ మ్యాప్ ద్వారా చోరీలు!!

Webdunia
గురువారం, 6 జులై 2023 (08:43 IST)
దొంగల్లో కూడా పలు రకాలైన వారు ఉంటారు. చిల్లర దొంగలు, ఘరానా దొంగలు, కాస్ట్లీ దొంగలు, మంచి దొంగలు ఇలా చెప్పుకుంటూ పోవచ్చు. తాజాగా ఓ దొంగ విమానాల్లో ప్రయాణాలు చేస్తూ చోరీలకు పాల్పడ్డాడు. చివరకు పోలీసులకు చిక్కి జైలు ఊచలు లెక్కిస్తున్నాడు. ఈ ఘట కేరళలో వెలుగు చూసింది. వివరాలను పరిశీలిస్తే, తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఓ ఘరానా దొంగను కేరళ పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద పోలీసులు జరిపిన విచారణలో అనేక ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. ఖమ్మం జిల్లా నుంచి తరచూ విమానాల్లో కేరళకు వచ్చి చోరీలు చేస్తున్నట్టు తిరువనంతపురం పోలీస్ కమిషనర్ వెల్లడించాడు. 
 
ఎస్పీ వెల్లడించిన వివరాల మేరకు.. "ఈ వ్యక్తి కేరళకు విమానంలో వస్తుంటాడు. ఇక్కడకు వచ్చాక ఆటోల్లో స్థానికంగా చక్కర్లు కొడుతూ తాళం వేసి ఉ్న ఇంట్లో ఏవో గుర్తిస్తాడు. ఆ తర్వాత గూగుల్ మ్యాచ్ సాయంతో రాత్రి సమయంలో మళ్లీ ఆ ఇళ్లకు వచ్చి చోరీలు చేస్తాడు. అతడు కేవలం బంగారు నగలు మాత్రమే చోరీ చేసి వాటిని ఖమ్మం తీసుకెళ్లేవాడు. ఆ నగలను అక్కడ తాకట్టుపెట్టి వచ్చిన డబ్బును తీసుకుని విలాసాలకు ఖర్చు చేసేవాడు. గత నెలలో పద్మనాభస్వామి ఆలయం సందర్శనకు వచ్చాడు. ఇందుకు జూన్ నెలలోనే ప్రణాళిక రచించుకున్నాడు. ఆ ప్రకారం మళ్లీ వచ్చాడు" అని తిరువనంతపురం పోలీస్ కమిషనర్ సీహెచ్ నాగరాజు వివరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments